టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా… ప్రమాదం నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…. ప్రమాదం జరిగిన దాదాపు 18 రోజుల తర్వాత… తొలిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన సర్జరీ విజయవంతమైందని, కోలుకుంటున్నానని ఇకపై వచ్చే ప్రతి సవాలును దైర్యంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, మీ అందరి మద్దతు...
శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాట్స్మెన్, ఆ తర్వాత బౌలర్లు చెలరేగటంతో వన్డే చరిత్రలో భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. విరాట్ కోహ్లీ 166 పరుగులతో, శుబ్మన్ గిల్ 116 పరుగులతో అదరగొట్టారు. మహమ్మద్ షమీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సిరాజ్ పవర్ ప్లే ఓవర్లలో వరుసగా వికెట్లను తీశాడు. శ్రీలంక టాప్ ఆర్డర్లోని ముగ్గురు ఆటగాళ్లను సిరాజ్ పె...
భారత్, న్యూజిలాండ్ ల మధ్య తొలివన్డేకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా.. ఈ వన్డే సిరీస్ జరగనుంది. కాగా… ఈ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో విక్రయించనున్నారు. గత సెప్టెంబరులో భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షు...
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది. పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేత...
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్… ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రస్తుతానికి ఆయన చికిత్స డెహ్రాడూన్లో కొనసాగుతోంది, అయితే ఇప్పుడు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే DDCA చికిత్స కోసం పంత్ను ముంబైకి తీసుకెళ్లనుం...
భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతనికి ఇద్దరు యువకులు రజత్ కుమార్, నిషు కుమార్ సాయపడ్డారు. రిషబ్ కారు కాలిపోతున్న సమయంలో అతనికి చెందిన వస్తువులు, నగదును వీరిద్దరు బయటకు తీశారు. అలా ఆ కారు నుండి తీసిన రూ.4వేలను కూడా వారు తిరిగి పోలీసులకు అందించారు. వీరి నిజాయితీకి ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ను వీరిద్దరు పరామర్శించారు. అన్న...
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కి శుక్రవారం ఉాదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… సినీ నటి ఊర్వశి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరించింది. అయితే ఆమె పంత్ గురించి ఎలాంటి ప్రస్తావన తీయకుండా.. సింపుల్గా ప్రార్థిస్తున్నాను అంటూ పోస్టును షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో ట...
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిషబ్పంత్ యాక్సిడెంట్పై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందు...
ఫుట్ బాల్ లెజెండరీ ప్లేయర్ మెస్సీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మెస్సీకి ఇప్పుడు అభిమానులు ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా మెస్సీని విపరీతంగా అభిమానిస్తాడు. ధోనీ కుమార్తె జీవా ధోనీ కూడా మెస్సీ అభిమానిగా మారింది. చిన్న వయసులోనే తండ్రిలాడే ఫుట్బాల్ క్రీడను బాగా ఎంజాయ్ చేస్తోంద...
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కి ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. ఇప్పటి వరకు సింధు… తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన ఆటతో… దేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలను తీసుకువచ్చింది. కాగా…. మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ.. ప్రశంసలను దక్కించుకుంటున్న సింధు సంపాదనలో దూసుకెళుతోందని ఫోర్బ్స్-2022 జాబితా చూస్తే అర్థమవుతుంది. ప్రతి యేటా మాదిరిగానే ఫోర్బ్స్ ఈ ఏడాది అత్యధిక మొత్...
ఐపీఎల్ 2023కి వేలం షురూ అయ్యింది. ప్రాంఛైజీలు…ఎగబడి మరీ.. టాలెంటెడ్ క్రికెటర్లను వేలంలో పట్టేస్తున్నాయి. తాజాగా.. ఈ వేలంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కి జాక్ పాట్ తగిలింది. ఎవరూ ఊహించని ధరకు భరత్ అమ్ముడయ్యాడు. కేఎస్ భరత్ ని.. ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ దాదాపు రూ.20లక్షలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేయడం గమనార్హం. వికెట్ కీపర్గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న 29 ఏళ్ల భరత్ను గుజరాత్ టైటా...
టీమిండియా కెప్టెన్ మళ్లీ మారనున్నాడా…? కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ రాగా…ఇప్పుడు రోహిత్ స్థానంలో… హార్దిక్ పాండ్యా రానున్నాడా అంటే… అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ టీమ్ఇండియా పగ్గాలు చేపట్టాడు. అదే ఏడాది డిసెంబర్లో వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్.. జట్టు...
సచిన్ టెండుల్కర్…. ఇది ఒక పేరు కాదు.. క్రికెట్ ప్రియులకు ఒక ఎమోషన్. క్రికెట్ అనగానే ముందుగా వినిపించే పేరు సచిన్. ఆయన తర్వాత… ఆయన కుమారుడు అర్జున్ కూడా అంతే గొప్ప క్రికెటర్ అవుతారని… ఆయన అభిమానులు ఎంతగానో ఆశించారు. అయితే… మరీ ఎక్కువగా పోల్చడం వల్లో.. సచిన్ కొడుకు అనే ఒత్తిడి కారణంగానో… అర్జున్ టెండుల్కర్ అభిమానులు ఆశించినంత పేరు మాత్రం సంపాదించుకోలేకపోయాడు. కానీ...
ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . ఆండ్రూ ఫింట్లాఫ్ కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు. బీబీసీ షో టాప్ గేర్ కోసం షూటిగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అతని ప్రమాదం గురించి బీబీసీ ముందుగా ప్రకటన విడుదల చేసింది...
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చిక్కుల్లో పడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) నోటీసు అందజేశారు. రోజర్ బిన్నీ కోడలు, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన మయంతి లాంగర్ స్టార్ స్పోర్ట్స్ తరఫున పని చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ భారత క్రికెట్ జట్టు సొంత గడ్డపై ఆడే మ్యాచ్లకు మీడియా హక్కులను కలిగి ఉన్న స...