తమపై లైంగిక దాడులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India -WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు (Wrestlers) ఉద్యమం చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కొన్ని వారాలుగా రోడ్డుపై బైఠాయించారు. కాగా వారి ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు రెజ్లర్లకు మధ్య తీవ్ర వాగ్వ...
భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక దశలో ముంబై ఓటమి ఖాయమనే అందరూ అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ని మొత్తం తిప్పేశారు.
లక్నో సూపర్ జెయింట్స్(LSG), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య పూర్తి కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మొదట ఆటకు దిగిన లక్నో 125 రన్స్ చేసింది. ఇక చివరి ఓవర్ ఉండగానే వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో ఆటను నిలిపేశారు.
మోకాలి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో కేన్ విలియమ్సన్(kane Williamson) రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతను గత నెలలో తన కుడి మోకాలికి సర్జరీ(surgery) చేయించుకున్నారు. ఈ క్రమంలో సర్జరీ విజయవంతమైనట్లు కేన్ పేర్కొనగా..విరాట్ సహా పలువురు స్పందించారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాను అధిగమించి నంబర్ వన్గా నిలిచింది. ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో లఖ్నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుత...
కోహ్లీ, గంభీర్ కు బీసీసీఐ భారీ జరిమానాను విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్ (Gowtham Gambhir) లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ స్వీట్ రివేంజ్ తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో జెయింట్స్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2023 చాలా ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ 16లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. లక్నో జెయింట్స్ ని స్వల్ప తేడాతో ఓడించింది.
నేడు(30 ఏప్రిల్ 2023) IPLకి చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణం ఈ రోజున 1000వ మ్యాచ్ జరగనుంది. దానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే మైదానంలో ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ జరగనుంది.
కొత్త సినిమా వస్తే చాలు పలు థియేటర్ల వద్ద హీరోల భారీ కటౌట్లను ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు హీరోలకే కాదు, క్రికెట్ స్టార్లకు కూడా తాజాగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇది ఏక్కడో కాదు హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఈ భారీ కటౌట్ ఎందుకో ఇక్కడ చుద్దాం.