అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో వన్డేల్లో తన 59వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భారత్ ప్రస్తుతం 27 ఓవర్లకు 117/2 పరుగులు చేసింది. రోహిత్(63*), శ్రేయస్ అయ్యర్(43*) క్రీజులో ఉన్నారు. కోహ్లి 0 , గిల్ 9 పరుగులు పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్జేవియర్ 2 వికెట్లు తీశాడు.