TG: ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే సుమారు 2వేల మంది పోలీసులు బందోబస్తుగా ఉండనున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల వెయ్యి మంది వాలంటీర్లు విధుల్లో ఉంటారు. 13వ తేదీ రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లోనే మెస్సీ బస చేస్తారు.