AP: విశాఖ సమ్మిట్లో 613 ఎంవోయూలు కుదిరినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలిపారు. కంపెనీలన్నీ ప్రారంభమైతే 20 లక్షల మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. ‘అమెరికాకు సిలికాన్ వ్యాలీ, ఏపీకి క్వాంటం వ్యాలీ. అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ ప్రారంభం కానుంది’ అని పేర్కొన్నారు.