భారత్ పిచ్లపై విమర్శలు చేస్తున్న మాజీ ప్లేయర్లపై టీమిండియా దిగ్గజం గవాస్కర్ మండిపడ్డాడు. రెండ్రోజుల్లో పెర్త్ టెస్ట్ ముగిస్తే మాట్లాడని వారు.. కోల్కతాలో మూడ్రోజుల్లో మ్యాచ్ ముగిస్తే మాత్రం విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత పిచ్ క్యూరేటర్లకు అజెండా ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించాడు. భారత క్రికెట్పై వేలెత్తి చూపడం మానుకోవాలని హితవు పలికాడు.