మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా టీమ్ విధ్వసం సృష్టించింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్లో ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ కేవలం 75 బంతుల్లోనే 138 పరుగులతో చెలరేగింది. కాగా, ఈ సిరీస్ 1-1 సమంతో ఉండగా.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.