ఏ పార్టీలో చేరతామనే అంశంపై జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇవ్వడం లేదు. వరసగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. నిన్న మల్లు రవిని కలువగా.. ఈ రోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మీట్ అయ్యారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ఘటనల నేపథ్యంలో యాత్ర2 మూవీ(Yatra2 Movie) సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఏపీ మంత్రి రోజా కాలినొప్పి, వాపు సమస్యలతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది.
స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే ప్రధాని మోదీ వచ్చాక ఈ తొమ్మిదేళ్లలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని జేపీ నడ్డా అన్నారు
కాంగ్రెస్ పార్టీలో చేరే నిర్ణయాన్ని నాగం జనార్ధన్తో భేటీ తర్వాత వెల్లడిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి (MLC Damodar Reddy) తెలిపారు
కాంగ్రెస్ ముఖ్య నేత మల్లు రవితో జూపల్లి కృష్ణారావు సమావేశం అయ్యారు. దీంతో ఆయన సొంతగూటికి చేరతారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ ను మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాపీ కొట్టారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఏపీ నేతలు గొప్పలు చెప్పుకోవడంలో పోటీ పడుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టగా వేయించుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నియోజకవర్గాల్లో సర్వేల నివేదిక, పనితనం ఆధారంగా వచ్చే ఎన్నికల్లో నేతలకు టికెట్లు ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
ఏపీ మంత్రి విడదల రజనీ విశాఖ పర్యటనలో ఛేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో లిప్టులో ఇరుక్కొన్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు తథ్యం అని తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్కు కేంద్రమంత్రి పదవీ ఇస్తారని సమాచారం.
త్వరలోనే టీడీపీ(TDP)లో చేరుతానని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు