నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నప్రాజెక్ట్ K(Project K) చిత్రంలో చేరినట్లు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించారు. 2024 జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Kavitha meet cm kcr:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన తండ్రి సీఎం కేసీఆర్ను (kcr) ఈ రోజు ప్రగతి భవన్లో (pragathi bhavan) కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న కూడా ఈడీ సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్ను కలిశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోని విచారిస్తొన్నారు. రిసెంట్ గా టీఎస్ పీఎస్సీలో పనిచేస్తోన్న 42 మంది ఎంప్లాయ్ కి నోటీసులు జారీ (Issuance of notices) చేసింది. టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ (Praveen )రాజశేఖర్లతో సన్నిహితంగా ఉన్నవా...
కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా గళం విప్పాలని బీఆర్ఎస్, (BRS) టీఎంసీ సహా దేశంలోని పలు విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీబీఐ (CBI) , ఈడీ ఇతర కేంద్ర సంస్థలపై న్యాయపోరాటం చేయనున్నాయి. సుప్రీంకోర్టు (Supreme Court) లేదా ఢిల్లీ హైకోర్టులో (High Court )పిటిషన్ దాఖలు చేయనున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తమపై సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా నడుచుకుంటూ దాడులు చేస్త...
భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈరోజు(మార్చి 22న) బ్రహ్మోత్సవాలు(Bhadradri Brahmotsavam) ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. మరోవైపు మార్చి 30న నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan), సీఎం కేసీఆర్(cm kcr)లకు ఆహ్వానం పంపారు.
Revanth reddy:పేపర్ లీకేజీ (paper leak) అంశం దుమారం రేపుతోంది. కమిషన్ రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.పేపర్ లీక్ కావడంతో (Paper Leak) నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ని టీ.కాంగ్రెస్ నేతలు (T.Congress Leaders) కలిశారు.
2030 నాటికి దేశంలో(india) 6జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) అన్నారు. ఈ సందర్భంగా 6G విజన్ డాక్యుమెంట్ను ప్రధాని మోదీ ఆవిష్కరించిన క్రమంలో పేర్కొన్నారు. ఇది రెండు దశల్లో అమలు చేయబడుతుందని చెప్పారు.
టీటీడీ (TTD) 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ (Budget) ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని ఆయన తెలిపారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు. పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ.990 కోట్లు, ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.500 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.330 కోట్ల ఆదాయ...
8 dead, 19 injured:తమిళనాడులో గల బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. కాంచీపురం జిల్లాలో గల పరిశ్రమలో పేలుడు జరిగి.. 8 మంది మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం దాస్ కా దమ్కీ. అయితే ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి తానే నిర్మించడం విశేషం. తనదైన రితీలో ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కూడా ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు(మార్చి 22న)విడుదలైన దాస్ కా దమ్కీ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోగ్రూప్ -డి (లెవల్ -1) ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు రిలీజ్ చేసింది. ఈ మేరుకు రైల్వేరిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ), సికింద్రాబాద్ (Secunderabad) అధికారిక ప్రకటన విడుదలయ్యాయి. లెెవెల్-1 ఖాలీల భర్తీకి సంబంధించి గత సంవత్సరం ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT EXAMS) నిర్వహించారు. ఈ ఏడాది జనవరి లో ఫిజికల్ టెస్ట్ (Physical test) చేశారు.
'మినీ క్యాప్సూల్' Realme C55 మోడల్ త్వరలోనే దేశీయ మార్కెట్లోకి రాబోతుంది. మార్చి 28 నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999గా ప్రకటించారు. ఈ ఫోన్ ఫీచర్లు ఇతర వివరాలపై ఓ లుక్కేయండి మరి.
Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల (police) కళ్లు గప్పి పంజాబ్ (punjab) నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. పారిపోయే ముందు సీసీటీవీ (cctv) ఫుటేజీ ఒకటి నిన్న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జలందర్ (jalander) వద్ద గల ఓ గురుద్వారాలో (gurdwara) చొరబడ్డారని తెలిసింది. అక్కడ ఉన్న వారిని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి.. ఆహారం, బట్టలు తీసుకున్నారట.