క్రికెట్ (Cricket) అభిమనులకు శుభవార్త. ఐపీఎల్ (IPL) 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 12
పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది.
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ భారత స్పిన్నర్లు రికార్డు నెలకొల్పారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ షమీ(Mahammad shami) 4 వికెట్లు పడగొట్టాడు.
కర్ణాటక (Karnataka) సీఎం బసవరాజు బొమ్మై ప్రభుత్వనికి కాంగ్రెస్ (Congress) నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిల్లోకి పువ్వులతో కనిపించారు. మాజీ సీఎం విపక్ష నేత సిద్దరామయ్య (Siddaramaiah) తోపాటు మరికొంత ఎమ్మేల్యేలు చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారు.
Somu Verraju : కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని వీడిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ వీడి వెళ్తూ వెళ్తూ సోము వీర్రాజు పై తీవ్ర విమర్శలు చేశారు. సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడినట్లు ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కాగా... తాజాగా.. కన్నా తనపై చేసిన కామెంట్స్ పై సోము వీర్రాజు స్పందించారు.
KTR : అందరికీ ఒకే అబద్దం నేర్పించాలని... ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని కేంద్రంలోని అధికార పార్టీపై మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రులు చెప్పేవన్నీ అబద్దాలని.. కనీసం అబద్ధాలనైనా అందరూ ఒకేలా చెప్పాలని, దాని కోసం కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీకి సూచించారు.
ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్పురి నటి సప్నా గిల్ అరెస్టయ్యారు. పృథ్వీ షాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీక్రెట్ బాక్సులో రాగి కంకులు పైన పెట్టి కింద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 23 కిలోలలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
కొన్ని కారణాల వల్ల భారతీయ రైల్వే (Railway) పలు రద్దు చేసింది. ట్రాకింగ్ ( Track) పనులు ఇతర మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు (cancellation) చేయడం, దారి మళ్లించడం లాంటిది చేస్తుంటుంది. 440 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
బాలీవుడ్ (Bollywood) నటి స్వర భాస్కర్ పెళ్లి పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ (Kangana Ranaut)ట్వీట్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhaskar) సీక్రెట్ పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని నిన్న (ఫిబ్రవరి 16) తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసింది.
Sharmila Padayatra : వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. మరికొన్ని రోజుల్లో షర్మిల పాదయాత్ర ముగియనుంది. మార్చి 5న పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో ముగింపు సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
లేఆఫ్ల బాటలో తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా చేరింది. ఈ క్రమంలో దేశంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 453 మందిని గురువారం అర్థరాత్రి నుంచి తొలగించినట్లు తెలిసింది. తొలగించబడిన Google ఉద్యోగులకు అధికారిక మెయిల్లో CEO సుందర్ పిచాయ్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ (Twitter)ను సొంతం చేసుకున్నప్పటి నుండి ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ ను సొంతం చేసుకోవడానికి ముందు కూడా నాటి యాజమాన్యంతో వివాదానికి తెర లేపాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జన్మదినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) అద్భుత కానుక అందించింది. తాను కలలుగన్న ప్రాజెక్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు నిర్మాణంపై వేసిన కేసులపై విచారించిన ధర్మాసనం ప్రాజెక్టు పనులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పెద్ద ఎత్తున నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్యా దేశీయ మార్కెట్లు కూడా దిగువకు పయనిస్తున్నాయి. దీంతో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 400, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 120కిపైగా, బ్యాంక్ నిఫ్టీ 710 పాయింట్లు కోల్పోయాయి.