ASR: అనంతగిరి మండలంలో శుక్రవారం జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ కుమార్ పర్యటించనున్నారని క్యాప్ కార్యాలయం నుంచి తెలిపారు. ముందు గా కాశీపట్నం జీసీసీ గుడౌన్ పరిశీలించిన అనంతరం డీపోలను తనిఖీ చేయనున్నారు. జీసీసీ ద్వారా సరఫరా అవుతున్న నిత్యావసర సరకులు, బియ్యం, తదితర వాటిపై గిరిజనులను అడిగి తెలుసుకుంటారని వారు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం బందరు కోటలోని మారుతీ స్వామి ఆలయం ప్రాంగణంలోని శివలింగం, వినాయక స్వామి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం కొంత మంది వ్యక్తులు ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆలయ కమిటీ సభ్యులు అంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గురువారం వారు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని వారు కోరారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పదవీ కాలంలో దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయి. 3జీ, 4 జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఆయన హయాంలోనే ఊపందుకుంది. వివిధ పథకాల కింద నగదు సహాయాన్ని ప్రభుత్వం ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే(DBT) ప్రక్రియ ప్రారంభమైంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఆయన నేతృత్వంలో అవతరించింది.
HNK: ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మాక్షి అమ్మవారి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి ఆశీర్వాదం ఇచ్చారు.
మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు కోన్స్టాస్ (60), ఖవాజా (57), లబుషేన్ (72) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్టీవెన్ స్మిత్ అద్భుత సెంచరీతో(140) మెరవడంతో 474 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్ 2 వికెట్లు, సుందర్ 1 వికెట్ పడగొట్టారు.
GTR: మంగళగిరిలోని V. J డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 12 కంపెనీల వారు హాజరవుతారని అన్నారు. 18 నుంచి 35 లోపు వారు అర్హులని అన్నారు. రూ.12 వేల నుంచి రూ.40 వేల వరకు జీతం లభిస్తుందని వివరించారు. https: //tinyurl.com రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
MNCL: జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు నూతన బల్బులను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరారు. జన్నారం పట్టణం నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉంది. ఆ రహదారికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు చాలా కాలం క్రితం విద్యుత్ బల్బులు బిగించారు. వాటిలో చాలా వరకు కాలిపోగా, మరికొన్ని వెలగడం లేదు. ఆ స్తంభాలకు నూతన బల్బులు ఏర్పాటు చేయాలన్నారు.
పర్యాటకుల సంఖ్యలో ఇప్పటివరకు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాను అయోధ్య అధిగమించింది. ఈ ఏడాదిలో తాజ్మహల్ను సందర్శించిన వారి కంటే అయోధ్యలో రామ మందిరాన్ని ఎక్కువ మంది దర్శించుకున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయోధ్యను 13.55 మంది సందర్శించినట్లు వెల్లడించింది. వీరిలో 3,153 మంది విదేశీయులు ఉన్నారు.
JGL: హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు ప్రజెంటేషన్ భాగంగా జగిత్యాల పట్టణానికి చెందిన సామాజికవేత్త బీరెల్లి స్వప్నకు 15వ స్థానం లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానేపల్లి జ్యువెలర్స్, వారాహి సిల్మ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైశ్య ఉమెన్ అవార్డును స్వప్నకు గురువారం అందజేశారు.
కామారెడ్డి: పట్టణంలోని ఓ స్వీట్ హోమ్లో స్వీట్లలో స్కబ్బర్ వచ్చిందని ఈనెల 24వ తేదిన ఫిర్యాదు వచ్చిందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ప్రముఖ స్వీట్ హౌస్ని తనిఖీ చేశారు. కొన్ని అనుమానిత నమూనాలు సేకరించి ల్యాబ్కి పంపించినట్లు చెప్పారు. ఇటువంటి తప్పిధాలు జరగకుండా ఉండాలని స్వీట్ హోమ్ యజమానులను హెచ్చరించారు.
NTR: విజయవాడలో జరిగిన దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బావాజీ పేటలో నివాసముంటున్న లీలకుమారి అనే మహిళ ఇటీవల హైదరాబాద్ వెళ్లి ఈనెల 25వ తేదీన తిరిగి వచ్చింది. వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సిన రూ.30 వేల నగదు, సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NDL: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల నంద్యాల MP డా.బైరెడ్డి శబరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘డా.మన్మోహన్ సింగ్ జి మరణం దేశానికి తీరని లోటు మిగిల్చింది. ఆయన జ్ఞానం, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం దేశంపై చెరగని ముద్రవేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు.
NRML: సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహించే కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 18 రోజులుగా ప్రభుత్వంతో పోరాడుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంలో జాప్యం చేయడంతో సమ్మెను ఉధృతం చేసే క్రమంలో బోధన బోధనేతర సిబ్బంది శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు దిగారు. దీంతో విద్యాబోధన నిలిచిపోనుంది.
WGL: బైకును కారు ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. BHPLకి చెందిన శివరాజ్ కుమార్, వైజాగ్కు చెందిన శేషు, KNRకు చెందిన అభిరామ్ NSPT బిట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు బైకుపై వెళ్లొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివరాజ్ మృతి చెందాడు.
✦ 1987 పద్మ విభూషణ్✦ 1993, 94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ, ఆసియా మనీ అవార్డు✦ 2002 అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు✦ 2006 ఇండియన్ ఆఫ్ ది ఇయర్✦ 2010 వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు✦ 2017 ఇందిరా గాంధీ బహుమతి✦ ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో చోటు