NRML: సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహించే కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 18 రోజులుగా ప్రభుత్వంతో పోరాడుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంలో జాప్యం చేయడంతో సమ్మెను ఉధృతం చేసే క్రమంలో బోధన బోధనేతర సిబ్బంది శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు దిగారు. దీంతో విద్యాబోధన నిలిచిపోనుంది.