MNCL: జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు నూతన బల్బులను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరారు. జన్నారం పట్టణం నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉంది. ఆ రహదారికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు చాలా కాలం క్రితం విద్యుత్ బల్బులు బిగించారు. వాటిలో చాలా వరకు కాలిపోగా, మరికొన్ని వెలగడం లేదు. ఆ స్తంభాలకు నూతన బల్బులు ఏర్పాటు చేయాలన్నారు.