HNK: ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మాక్షి అమ్మవారి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి ఆశీర్వాదం ఇచ్చారు.
మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు కోన్స్టాస్ (60), ఖవాజా (57), లబుషేన్ (72) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్టీవెన్ స్మిత్ అద్భుత సెంచరీతో(140) మెరవడంతో 474 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్ 2 వికెట్లు, సుందర్ 1 వికెట్ పడగొట్టారు.
GTR: మంగళగిరిలోని V. J డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 12 కంపెనీల వారు హాజరవుతారని అన్నారు. 18 నుంచి 35 లోపు వారు అర్హులని అన్నారు. రూ.12 వేల నుంచి రూ.40 వేల వరకు జీతం లభిస్తుందని వివరించారు. https: //tinyurl.com రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
MNCL: జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు నూతన బల్బులను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరారు. జన్నారం పట్టణం నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉంది. ఆ రహదారికి ఇరువైపులా ఉన్న స్తంభాలకు చాలా కాలం క్రితం విద్యుత్ బల్బులు బిగించారు. వాటిలో చాలా వరకు కాలిపోగా, మరికొన్ని వెలగడం లేదు. ఆ స్తంభాలకు నూతన బల్బులు ఏర్పాటు చేయాలన్నారు.
పర్యాటకుల సంఖ్యలో ఇప్పటివరకు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాను అయోధ్య అధిగమించింది. ఈ ఏడాదిలో తాజ్మహల్ను సందర్శించిన వారి కంటే అయోధ్యలో రామ మందిరాన్ని ఎక్కువ మంది దర్శించుకున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయోధ్యను 13.55 మంది సందర్శించినట్లు వెల్లడించింది. వీరిలో 3,153 మంది విదేశీయులు ఉన్నారు.
JGL: హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు ప్రజెంటేషన్ భాగంగా జగిత్యాల పట్టణానికి చెందిన సామాజికవేత్త బీరెల్లి స్వప్నకు 15వ స్థానం లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానేపల్లి జ్యువెలర్స్, వారాహి సిల్మ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైశ్య ఉమెన్ అవార్డును స్వప్నకు గురువారం అందజేశారు.
కామారెడ్డి: పట్టణంలోని ఓ స్వీట్ హోమ్లో స్వీట్లలో స్కబ్బర్ వచ్చిందని ఈనెల 24వ తేదిన ఫిర్యాదు వచ్చిందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ప్రముఖ స్వీట్ హౌస్ని తనిఖీ చేశారు. కొన్ని అనుమానిత నమూనాలు సేకరించి ల్యాబ్కి పంపించినట్లు చెప్పారు. ఇటువంటి తప్పిధాలు జరగకుండా ఉండాలని స్వీట్ హోమ్ యజమానులను హెచ్చరించారు.
NTR: విజయవాడలో జరిగిన దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బావాజీ పేటలో నివాసముంటున్న లీలకుమారి అనే మహిళ ఇటీవల హైదరాబాద్ వెళ్లి ఈనెల 25వ తేదీన తిరిగి వచ్చింది. వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సిన రూ.30 వేల నగదు, సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NDL: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల నంద్యాల MP డా.బైరెడ్డి శబరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘డా.మన్మోహన్ సింగ్ జి మరణం దేశానికి తీరని లోటు మిగిల్చింది. ఆయన జ్ఞానం, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం దేశంపై చెరగని ముద్రవేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు.
NRML: సమగ్ర శిక్ష పరిధిలో విధులు నిర్వహించే కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 18 రోజులుగా ప్రభుత్వంతో పోరాడుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంలో జాప్యం చేయడంతో సమ్మెను ఉధృతం చేసే క్రమంలో బోధన బోధనేతర సిబ్బంది శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు దిగారు. దీంతో విద్యాబోధన నిలిచిపోనుంది.
WGL: బైకును కారు ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. BHPLకి చెందిన శివరాజ్ కుమార్, వైజాగ్కు చెందిన శేషు, KNRకు చెందిన అభిరామ్ NSPT బిట్స్ కాలేజీలో చదువుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ముగ్గురు యువకులు బైకుపై వెళ్లొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివరాజ్ మృతి చెందాడు.
✦ 1987 పద్మ విభూషణ్✦ 1993, 94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ, ఆసియా మనీ అవార్డు✦ 2002 అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు✦ 2006 ఇండియన్ ఆఫ్ ది ఇయర్✦ 2010 వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు✦ 2017 ఇందిరా గాంధీ బహుమతి✦ ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో చోటు
ప్రకాశం: అర్ధవీడు మండలంలోని మొహిద్దీన్ పురం గ్రామం నుంచి నాగులవరం గ్రామం వెళ్ళే రోడ్డులో గురువారం రాత్రి 11గంటలకు చిరుత సంచారం కలకలం రేపుతోంది. కంభం నుంచి అర్ధవీడుకు ముగ్గురు వ్యక్తులు కారులో వెళ్తుండగా మొహిద్దీన్ పురం సమీపంలో ఓ చిరుత అటుగా వెళ్లడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సమీపంలో ఉన్న గొర్రెల కాపరులను హెచ్చరించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రస్ అథనోమ్ అక్కడే ఉన్నారు. కానీ ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. టెడ్రస్తో పాటు ఐరాసకు చెందిన ఉద్యోగులు విమానం ఎక్కడానికి వేచి ఉన్న టైంలోనే ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఈ దాడిని ఐరాస తీవ్రంగా ఖండించింది.
KMM: ఉమ్మడి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇంఛార్జి దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా మంత్రి పొంగులేటి అధికార పర్యటన వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు.