తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుండగా, ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు బయలు దేరారు. కాగా… ఆయన పాదయాత్రకు బయలు దేరుతున్న సందర్భంగా… ఆయనకు కుమార్తె నైనిషా రెడ్డి హారతి ఇచ్చి వీర [&...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై ఆమె విమర్శల యుద్ధం చేశారు. తెలంగాణలో గత 8 ఏళ్లలో 8000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఈసందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న నాందే...
మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మచిలీపట్నంలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించారట. ఈ విషయంపై నిరసన చేపట్టగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల విలువగల భూమిని పార్టీ ఆఫీసుకు ఎలా కేటాయిస్తారని ఆందోళనకు దిగారు. ఆ భూమిని మీడియా ప్రతినిధులకు చూపించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మచ...
తన తండ్రి బెడ్ మీద మూత్రం పోశాడని అతడి గొంతు నులిమి చంపేశాడు కొడుకు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆనంద్ పర్బట్ ఏరియాలో ఉండే జితేంద్ర శర్మకు పక్షవాతం వచ్చింది. దీంతో బెడ్ మీది నుంచి లేచి నడవలేడు. 2020లో ఆయనకు పక్షవాతం వచ్చింది. అంతకుముందు ఆటోరిక్షా నడిపేవాడు. అయితే.. మద్యం బాగా తాగే అలవాటు ఉన్న జితేంద్ర.. రోజూ తాగి వచ్చి భార్యను వేదిస్తున్నాడని భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయింది. [&he...
భూ ప్రకంపనాలతో టర్కీ, సిరియా గజగజ వణుకుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి మూడుసార్లు భూకంపం వచ్చింది. తీవ్రత కూడా రిక్టర్ స్కేల్పై 7.8 నమోదవడంతో ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంది. భూ ప్రకంపనాలతో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. రెండు దేశాల్లో కలిసి ఇప్పటివరకు 1904 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1939 తర్వాత తమ దేశంలో వచ్చిన పెద్ద భూకంప...
టర్కీలో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీతో పాటు దాని పక్కనే ఉన్న సిరియా దేశాన్ని కూడా వదల్లేదు. రెండు దేశాలు భూకంపం ధాటికి దద్దరిల్లిపోయాయి. వందలాది మంది శిథిలాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్పై 7.8 గా తీవ్రత నమోదు అయింది. భూకంపం తీవ్రత పెరగడం వల్ల 1400 మంది బిల్డింగ్స్ కూలిపోయి మృతి చెందారు. సోమవారం ఉదయం ఒకసారి భూకంపం వచ్చింది. మళ్లీ మధ్యాహ్నం 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింద...
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది బ్యాంక్ ఉద్యోగిని ఒక కస్టమర్ చితకబాదిన వీడియో. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని లోన్ విషయంలో కస్టమర్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన బ్యాంక్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. నాదియడ్ బ్రాంచ్ అది. ఉద్యోగి తన పని తాను చేసుకుంటున్నాడు. తన సీటు దగ్గరికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఏం జరుగుతుందా అని తేరుకునే ...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గొడవలు బాధాకరం అన్నారు. నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇంఛార్జీ రావడం ఇబ్బందిగా ఫీలవుతున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికకు పట్టుమని ఏడాది కూడా లేదని చెప్పారు. నేతలు కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టడాన్ని స్వాగతించారు. యాత్రలో తాను కూడా పాల్గొంటానని తెల...
ఓ వ్యక్తి రద్దీ మార్కెట్లో కత్తితో స్థానికులను బెదిరించాడు. వాళ్ల మీదికి.. వీళ్ల మీదికి దూసుకెళ్లబోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చినా కూడా వాళ్లను కూడా కత్తితో బెదిరించాడు ఆ వ్యక్తి. కత్తి కింద పడేయాలని పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ల మీదికి కూడా కత్తితో దూసుకెళ్లబోయాడు. దీంతో విసుగెత్తిన ఓ పోలీస్.. వెంటనే గన్ తీసి అతడ...
ప్రముఖ నేపథ్యగాయనీ వాణీ జయరామ్ మృతిపై మిస్టరీ వీడింది. ఆమెది సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. బెడ్రూంలో గ్లాస్తో ఉన్న టీపాయ్పై వాణీ జయరాం పడిపోయారని వివరించారు. దీంతో తలకు తీవ్ర గాయమై చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే విషయం తేలిందని చెప్పారు. అపార్ట్ మెంట్ వద్ద సీసీ కెమెరా పరిశీలించామని వివరించారు. వాణీ జయరామ్ చనిపోయిన సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించలేదని పేర్కొన్నారు. ఆమె మృతి...
ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమా ఇండస్ట్రీవైపు చూస్తోందంటే దానికి కారణం మరెవరో కాదు.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయనకు ఇంత పేరు ఊరికే రాలేదు. ఏదో సినిమాలు చేసేసినంత మాత్రాన రాలేదు. దాని కోసం కఠోరంగా శ్రమించారు. ఆయన విజయం వెనుక ఎన్ని ఓటములు ఉన్నాయో ఆయనకు తప్పితే ఇంకెవరికీ తెలియదు. దర్శకేంధ్రుడు రాఘవేంద్రరావు దగ్గర చాలా ఏళ్ల పాటు రాజమౌళి పని చేసిన విషయం తెలిసిందే. సీరియల్స్ ను డైరెక్ట్ చేయడం ఆ...
రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పాదయాత్రకి రమ్మన్నారని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెలిపారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగా యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్తో కలిసి రావడం లేదట. దీంతో ఇంచార్జీ ఠాక్రే రంగంలోకి దిగారు. ఈ రోజు వీహెచ్, దామోదర రాజనర్సింహాతో భేటీ అయ్యారు. పాదయాత్రలో పాల్గొనాలని న...
తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు నీటి పారుదల రంగానికి కూడా భారీగా నిధులను కేటాయించారు . నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.26, 831 కోట్లు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని బడ్జెట్ స్పీచ్ చదవుతూ పేర్కొన్నారు. బావులు, బోర్లే దిక్కయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలడిందని గుర్తుచేశారు. పాడుబడిన ఇండ్లు, బీడుపడిన పొలాలతో బక్క చిక్కిపోయిందని తెలిపారు. ఈ రోజ...
తెలంగాణ బడ్జెట్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పెదవి విరిచారు. బడ్జెట్ పాత చింతకాయ పచ్చడే అని అభివర్ణించారు. అబద్దాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శలు చేశారు. కేసీఆర్ అబద్దాల కోరు అని.. అబద్దాలు విని ప్రజలు విసిగిపోయారని చెప్పారు. మరికొద్దీ రోజుల్లో కేసీఆర్ నిజ స్వరూపం బయటపడుతుందని చెప్పారు. కేసీఆర్ మోసాలను వినేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరని చెప్పారు. దేశ్ క...
భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజమే.. కానీ అంతమాత్రానికి భర్తను భార్య, భార్యను భర్త వదిలేయలేరు కదా. విడాకులు తీసుకోరు కదా. అఫ్ కోర్స్.. చిన్న చిన్న గొడవలకు కూడా విడాకులు తీసుకునే వాళ్లు ఉన్నారు కానీ.. చాలా తక్కువ మంది ఆవేశంలో ఆ పని చేసి తర్వాత బాధపడతారు. ఏ భార్యాభర్త మధ్య గొడవ జరగకుండా ఉండదు. ఆ తర్వాత వెంటనే కలిసిపోయే మనస్తత్వం ఇద్దరికీ ఉండాలి. లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయినా అవ్వాలి. [...