ktr:ప్రధాని మోడీపై (modi) మంత్రి కేటీఆర్ (ktr) ఫైరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినా.. పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదని అడిగారు. ఈ మేరకు ధర వివరాల డేటాతో సహా ఆయన వివరించారు. 2014 మే నెలలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ (petrol) ధర రూ.71 ఉండేదని గుర్తుచేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని(custody extended) ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 3 వరకు పొడిగించింది. అంతకుముందు శుక్రవారం సిటీ కోర్టు సీనియర్ AAP నాయకుడి ED కస్టడీని మార్చి 22 వరకు పెంచింది. అయితే నిందితుడిని సమర్థవంతమైన విచారణ కోసం భౌతిక కస్టడీ అవసరమని పేర్కొంది.
CPI Narayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారు మనుషులా? పశువులా? అని నిలదీశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని నారాయణ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్ పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజశేఖర రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించినట్లు పోలీసు శాఖ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.
సుప్రీం కోర్టు(Supreme Court) కేంద్ర సర్కారుకు షాక్ ఇచ్చింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(One Rank One Pension) ఎరియర్స్ పేమెంట్ విషయంలో మోదీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. మాజీ సైనికుల(Ex servicemen)కు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ నోట్ ను సుప్రీం స్వీకరించలేదు. మాజీ సైనికులకు వెంటనే ఎరియర్స్ డబ్బులు ఇవ్వాలని, అందుకు గడువును కూడా నిర్దేశించింది.
రిషబ్ శెట్టి యాక్ట్ చేసిన కాంతారా మూవీ(Kantara movie) గత ఏడాది విడుదలైనప్పటికీ ఇంకా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కూడా పలు భాషల్లో విడుదల అవుతూ మరింత మంది అభిమానులకు దగ్గరవుతుంది. ఇప్పటికే ఇటీవల ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగంగా కాంతారా చిత్రాన్ని ప్రదర్శించారు. తాజాగా ఇటాలియన్, స్పానిష్ భాషల్లో కూడా కాంతారా(Kantara) చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Chiranjeevi:మెగా డాటర్ నిహారిక (niharika)- చైతన్య జొన్నలగడ్డ (chaitanya) విడిపోతున్నారా? ఇన్ స్టాలో నిహారిక (niharika) ఇమేజేస్ చైతన్య తీసివేయడంతో వారు డివైడ్ అవుతున్నారా అనే చర్చ జరుగుతుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరగడంతో పోలీసు కేసు(Police case) నమోదైంది. ఈ చోరీలో సుమారు రూ.3.60 లక్షల విలువైన డైమండ్స్(Diamonds), గోల్డ్(Gold)ను దుండగులు దొంగిలించారు. ఈ చోరీ గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య(Iswarya) చెన్నైలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ తెలిపిన ఫిర్యాదు మేరకు..ఆమెకు చెందిన 60 ...
హీరోయిన్ నయనతార(Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Shivan) దంపతులు తమ కవలపిల్లలతో చిత్రాలను(Nayanthara Twins pics) ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఇవి చూసిన పలువురు అభిమానులు(fans) సంతోషం వ్యక్తం చేస్తుండగా..మరికొంత మంది మాత్రం వారి ముఖాలను మళ్లీ చూపించలేదని నిరాశ చెందుతూ కామెంట్లు చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసు సోమవారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఈ లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాఫ్తు చేస్తోంది. లీకేజీ పైన ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు అందిస్తోంది.
ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలో నాటు నాటు(natu natu song) పాట అసలు నచ్చలేదు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(Shiv Shakti Dutta) పేర్కొన్నారు. అందులో సంగీతం ఎక్కడుంది, ఇది కూడా ఓ సంగీతమా అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా వ్యాఖ్యలు చేశారు. తాను కూడా గతంలో అనేక చిత్రాలకు పాటలు రాసినట్లు తెలిపారు.
అసెంబ్లీలో ఇష్టారీతీన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హద్దు మీరితే శాశ్వతంగా చట్ట సభలకు రాకుండా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా సోమవారం డిమాండ్ చేశారు.
YS Bhaskar reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (vivekananda) హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా కేసులో ఏ-4 దస్తగిరిని అఫ్రూవర్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ కేసులో దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే.
Nama : బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ దూరం పెడుతోందనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ చేయడం గమనార్హం. తనను ఎక్కడికి పిలిచినా వస్తానని ఆయన అన్నారు.
భారతదేశం vs ఆస్ట్రేలియా 3వ ODI మ్యాచ్ మార్చి 22న చెన్నై(chennai)లోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మ్యాచ్ ఆన్ లైన్ టిక్కెట్లు(tickets) విక్రయించగా..ప్రస్తుతం ఆఫ్ లైన్ టిక్కట్ల కోసం క్రీడాభిమానులు(cricket fans) పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టారు.