కోనసీమ: ఆత్రేయపురం జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో వార్షిక పరీక్షలు రాయనున్న నేపథ్యంలో క్షత్రియ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం పరీక్ష సామాగ్రి కిట్లను అందజేశారు. ఈ సామాగ్రిని అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు సంజీవ్ అందజేశారు.
NRPT: ప్రభుత్వం రక్షణ చట్టం తేవాలని న్యాయవాదులు గురువారం నారాయణపేట జిల్లా కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ.. రేపటిలోగా న్యాయవాదుల చట్టం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.
GNTR: తెనాలి మార్కెట్ యార్డులో మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బలప్రదర్శన పోటీలకు గురువారం భూమి పూజ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను ప్రారంభించారు. పశుపోషకులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
AP: మాజీ సీఎం జగన్ నెల్లూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి ఫంక్షన్ హాల్ వరకూ అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమికూడారు. వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి కుమారుడి వివాహానికి ఆయన హాజరుకానున్నారు.
HYD: ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.
E.G: జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో రాజమండ్రిని అగ్రగామిగా నిలపాలని రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం రాజమండ్రిలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదును యజ్ఞంలా నిర్వహించాలని అన్నారు.
BHPL: చిట్యాల(M) నవాబుపేట గ్రామానికి చెందిన PACS మాజీ డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సతీమణి రమ క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఈ రోజు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. BRS నేతలు ఉన్నారు.
NLR: నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నిక గురువారం జరిగింది. దేవరకొండ సుజాత పేరును 40వ డివిజన్ కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. పోటీ లేకపోవడంతో 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను అధికారికంగా ప్రకటించారు.
RR: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలో BJP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా OBC మోర్చా నాయకుడు బోయిని మహేష్ యాదవ్ MPకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ నలంద కళాశాలలో మార్చి 1న ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత కుమారి పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు పొందవచ్చు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. సమాచారం కోసం 9494149416 నంబర్కు సంప్రదించాలని వెల్లడించారు.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, చిన్నారి మృతిపై జిల్లా SP సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతుండగా, నమోదైన కేసులు, అరెస్టయిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సున్నితమైన అంశంపై ఆసక్తి నెలకొంది.
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను కలిసి రామగిరి మండల పోలీస్ వసతులపై చర్చించారు. రామగిరిలోని ఎస్సై, సిబ్బంది క్వార్టర్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని విన్నవించారు. పోలీస్ స్టేషన్ ఆధునీకరణ, కాంపౌండ్ వాల్, రోడ్డు సౌకర్యాల కోసం రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు.
SDPT: మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శివోల సతీష్ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల గృహ ప్రవేశంలో ప్రారంభోత్సవంలో సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ఎన్నో సంవత్సరాలు సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొంత ఇంటి కల పేదలకు నెరవేరింది.
NDL: మహానంది క్షేత్రంలో కర్నూలు జిల్లా కన్ఫ్యూమర్ కోర్టు జడ్జి జస్టిస్ కరణం కిషోర్ కుమార్ ఏపీ లోకాయుక్త సీసీ అమరేంద్ర రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వీరికి ఘనంగా స్వాగత పలికారు. శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందిశ్వరస్వామిని దర్శించుకుని అభిషేకాలు కుంకుమార్చనలు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. క్రిమినల్ లా ప్రాక్టీస్ లో కనీసం 7 ఏళ్ల అనుభవం, సెషన్స్ కేసులు నిర్వహించిన వారు అర్హులన్నారు.