• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సోలార్ సమస్యలు ఉన్నాయా.. ఈ నెంబర్‌కు 1912కు తెలపండి

ATP: సోలార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్ సెంటర్‌లో సోలార్ విద్యుత్ సమస్యలను సైతం ఫిర్యాదు చేసే స్కౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోపు పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 04:52 PM IST

GHMC మూడుముక్కలు.. కేసుపై GHMC కసరత్తు

HYD: 1996 జీవో 570 ప్రకారం జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగలేదని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి జీహెచ్ఎంసీ, పురపాలక శాఖకు మూడు వారాల గడువు మంజూరు చేసింది. నిర్ణీత సమయంలో కౌంటర్లు సమర్పించాలని ఆదేశించింది. దీంతో సమాధానంపై GHMC, పురపాలక శాఖ పకడ్బందీగా కసరత్తు చేస్తూ నిర్విరామంగా కష్టపడుతోంది.

February 25, 2026 / 04:50 PM IST

రోడ్డు ప్రమాదాలు విధి కాదు.. మన నిర్లక్ష్యమే

మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. రహదారి ప్రమాదాలు విధి రాత కాదని, మన నిర్లక్ష్య ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ దేశంలో 450 మంది ప్రమాదాల్లో మరణించడం ఆందోళనకరమని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని మరియు ట్రాఫిక్ నియమాలు పాటించాలని విద్యార్థులకు సూచించారు.

February 25, 2026 / 04:50 PM IST

దుద్యాలలో ఘనంగా రామాలయ భూమి పూజ

అన్నమయ్య: సంబేపల్లి(మం) దుద్యాల గ్రామంలోని కొండ కింద పల్లెలో నూతన రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ ఘనంగా జరిగింది. TDP నేత మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. రాయచోటి నియోజకవర్గంలో 39 ఆలయాల కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్టు రూ. 6.7 కోట్లు మంజూరు చేసిందని, అందులో భాగంగా ఈ రామాలయానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

February 25, 2026 / 04:50 PM IST

అకాల వర్షాలు.. అధికారులకు తుమ్మల కీలక సూచనలు

TG: రాష్ట్రంలో అకాల వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పంటల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సహాయం అందించాలన్నారు.

February 25, 2026 / 04:48 PM IST

రైతును పండ్ల తోటలు పెట్టేలా ప్రోత్సహిస్తాం: CM

AP: రాయలసీమలో హార్టికల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం. ప్రతి రైతును పండ్లతోటలు పెట్టేలా ప్రోత్సహిస్తాం. మార్కాపురంను ఉద్యానవనంగా మారుస్తాం. రూ.1300 కోట్లతో ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీళ్లిస్తాం’ అని పేర్కొన్నారు.

February 25, 2026 / 04:48 PM IST

మూసి పరివాహక ప్రాంతల్లో రెడీమిక్స్ కాలుష్యం..!

HYD: మూసి పరివాహక ప్రాంతాలు, జంట జలాశయాల చుట్టుపక్కల రెడీమిక్స్ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో కాలుష్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, ప్రతాప్ సింగారం ప్రాంతాల్లో యూనిట్లు అధికంగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ధూళి, శుద్ధి చేయని వ్యర్థ జలాలు జలాశయాలకు ముప్పుగా మారుతున్నాయి.

February 25, 2026 / 04:47 PM IST

జిల్లాలోని శుభకార్యాలలో పాల్గొన్న.. మాజీ MLA

BHPL: భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ MLA నూతన వధూవరులను హృదయపూర్వకంగా ఆశీర్వదించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:46 PM IST

‘కార్యకర్తల క్షేమానికి ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకం’

ELR: పార్టీ బలోపేతానికి, కార్యకర్తల క్షేమానికి ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకమని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో భీమడోలు మండలానికి సంబంధించి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భీమడోలు మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:46 PM IST

ప్రభుత్వ ఆసుపత్రి నీ పరిశీలించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి పట్టణంలోని నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి నీ బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి పరిశీలించడం జరిగింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల గురించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్. సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ రహీనా బేగం ఎంపీడీవో ఎమ్మార్వో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

February 25, 2026 / 04:45 PM IST

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి’

ATP: గుత్తిలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో కొత్తగా ప్రవేశం కోసం 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.

February 25, 2026 / 04:45 PM IST

‘మావోయిస్టు గణపతి లొంగిపోవాలి’

‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతికి ఆయన సోదరుడు రామచంద్రరావు కీలక విజ్ఞప్తి చేశారు. వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. గణపతితో పనిచేసిన అందరూ లొంగిపోయారని వెల్లడించారు. గణపతిపై 12 రాష్ట్రాల్లో ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు.

February 25, 2026 / 04:44 PM IST

50 మంది విద్యార్థులు గైర్హాజరు

KNR: జమ్మికుంట పట్టణంలోని మూడు కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జనరల్ విభాగంలో 22 మంది, ఓకేషనల్‌లో 28 మంది.. మొత్తంగా 50 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అధికారులు ‘సెట్-బి’ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేయగా, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.

February 25, 2026 / 04:44 PM IST

మల్కాజ్‌గిరి పరిధిలో పెరిగిన దోమల బెడద

MDCL: మల్కాజ్‌గిరి పరిధిలోని బండ చెరువు, షఫీ నగర్, హనుమాన్ నగర్, మౌలాలి, భారత్ నగర్ ప్రాంతాల్లో దోమల విపరీతంగా పెరిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల వద్ద నిల్వ నీరు, డ్రైనేజీ సమస్యల వల్ల పరిస్థితి విషమించిందని చెబుతున్నారు. వెంటనే ఫాగింగ్, యాంటీ లార్వల్ చర్యలు చేపట్టి ప్రజలను వ్యాధుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

February 25, 2026 / 04:43 PM IST

‘వెలిగొండ కోసం రూ.5,458 కోట్లు ఖర్చు చేశాం’

AP: వెలిగొండ కోసం ఇప్పటివరకు రూ.5,458 కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఈ ప్రాజెక్టు కోసం రూ.9,081 కోట్లు అవసరం. ఈ రోజు రూ.456 కోట్లతో లైనింగ్ పనులు ప్రారంభించాం. మరో రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తే అన్ని జిల్లాలకు నీళ్లు ఇవ్వొచ్చు. గత ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు అయిపోయాయని ప్రజలను మోసం చేశారు’ అని విమర్శించారు.

February 25, 2026 / 04:42 PM IST