VZM: వ్యవసాయంలో AI టెక్నాలజీ ద్వారా నూతన ఒరవడి సృష్టించవచ్చునని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీ ద్వారా రైతులు ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చో, పంటల దిగుబడి పెంచేందుకు AIను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం AI ద్వారా వ్యవసాయ అభివృద్ధికి రూ. 500 కోట్లను కేటాయించి ఫలతాలు సాధించారన్నారు.
HYD: సికింద్రాబాద్ రాణిగంజ్లో నకిలీ బేరింగుల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. SKF బ్రాండ్ పేరుతో కల్తీ మాల్ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు మెరుపుదాడులు చేశారు. SV టూల్, బేరింగ్ ఇంటర్నేషనల్ వంటి షాపుల్లో ఏకంగా 1987 నకిలీ బేరింగులు, వేల సంఖ్యలో ప్యాకింగ్ బాక్సులను సీజ్ చేశారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
GNTR: పెదకాకానిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ బోర్డుపై సమీక్ష చేయడాన్ని స్వాగతించారు. అయితే, మరణించిన కార్మికుల కుటుంబాలకు బెనిఫిట్లు నిరాకరించడం, 46 వేల క్లైములను నిలిపివేయడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
NRML: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రక్త కళ్యాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న ఆమె, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల విషయంలో అలసత్వం వహించరాదని అధికారులకు తెలిపారు.
BDK: క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా సాగిస్తున్నదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ 46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్వాల విమలాదేవి ఎన్నికయ్యారు. సోమవారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కొత్వాలతో పాటు విమలాదేవిని సత్కరించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక 26వ డివిజన్ విక్రమ్ నగర్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. 100% నిర్దేశించిన ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి పన్ను, ఖాళీ స్థలం పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు.
BDK: ఆళ్లపల్లి మండలం రామానుజగూడెం గ్రామంలో బొల్ల భవాని నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు.
VSP: కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రజల నుంచి సోమవారం వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పాల్గొన్నారు.
ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి ఇవాళ తెలిపారు. 2025-26 రబీ సీజన్కు 24, 580మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అధిక ధరలకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 8341302863కు సంప్రదించాలనిన్నారు.
AP: శాసనసభలో వివిధ శాఖల బడ్జెట్ డిమాండ్లను మంత్రులు ప్రవేశపెట్టారు. సాంఘిక సంక్షేమ శాఖకు DSBV స్వామి రూ.11,118 కోట్లు.. మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖకు సంధ్యారాణి రూ.4,764 కోట్లు.. BC సంక్షేమ శాఖకు సవిత రూ.34,350 కోట్లు.. అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి NMD ఫరూఖ్ రూ.2,956 కోట్లు.. పౌరసరఫరాలశాఖకు నాదెండ్ల రూ.3,821 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టారు.
ప్రకాశం: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న సయ్యద్ మస్తాన్వలి అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన, సెలవుపై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.
BDK: అశ్వారావుపేటలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో Arrive Alive – Phase 2 కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణ రక్షణ సాధ్యమని ఎస్సై అఖిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
KMR: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే బయలుదేరిన KMR ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సముదాయానికి చేరుకున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు నెలకొన్న నేపథ్యంలో కలెక్టరేట్ సముదాయానికి రావాలని ఎమ్మెల్యే శనివారం సవాలు విసిరిన విషయం విధితమే. సవాలను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు సైతం కలెక్టరేట్ కి వస్తారో లేదో ప్రశ్నార్థకంగా మారింది.