MNCL: స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ.. ప్రతి నెల రూ.50 వేలు పెన్షన్ , 250 గజాల ఇంటి స్థలం, కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్య సౌకర్యాలు కొరకు హెల్త్ కార్డు ఇవ్వాలని కోరారు.
WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధి కాశిబుగ్గలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. మూడు రోజులుగా నల్లాల ద్వారా మురికి నీరు సరఫరా అవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు రంగు మారి, దుర్వాసన వస్తుండటంతో తాగడానికి వీల్లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వేస్తున్నారు.
తమిళ నటుడు, TVK అధినేత విజయ్ దళపతి తన భార్య సంగీతతో విడాకుల వ్యవహారాన్ని సామరస్యంగా ముగించాలని చూస్తున్నట్లు సమాచారం. కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండేందుకు ఆమెకు రూ.250 కోట్ల భారీ భరణాన్ని ఆఫర్ చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తు, కుటుంబ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యక్తిగత విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
TPT: తడ మండలం పెరియవట్టు గ్రామంలో జరిగిన ప్రభాకరన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో వి.దినేష్, వి.సతీష్, వి.విగ్నేష్ అలియాస్ విక్కీ అనే ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, క్రైమ్ నం. 33/2026 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు.
VKB: మర్పల్లిలోని పట్లూర్, భూచన్పల్లి, మర్పల్లిలో హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకల్లో సర్పంచ్ రామేశ్వర్ స్వయంగా పాల్గొని యువతతో కలిసి రంగులు చల్లుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని, సోదరభావం, ఐక్యత మరియు పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
SRPT: మఠంపల్లిలో నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఇంఛార్జ్ ఎంపీడీవో లావణ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణలో పంచాయితీ కార్యదర్శులు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని, ఇది తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చని వార్డు సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MLG: రామప్ప నుంచి లక్నవరం చెరువులోకి నీటిని తరలించే ప్రాజెక్టు విషయంలో అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క అన్నారు. ములుగు(D)లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తామని తెలిపారు. భూ సేకరణ ప్రతిపాదనలను 15రోజుల్లో సమర్పించాలని అధికారులకు సూచించారు.
PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఈనెల 6వ తేదీ నుంచి మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. మార్చి 6వ తేదీన వీరఘట్టం, పాలకొండ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే, మార్చి 7వ తేదీన జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించి, రాత్రికి పార్వతీపురంలోనే బస చేస్తారు.
అన్నమయ్య: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా ప్రమాదం నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో టపాసుల తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై కఠిన ఆంక్షలు విధించినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. తనిఖీలు పూర్తయ్యే వరకు అన్ని బాణసంచా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. PESO నిబంధనలు, లైసెన్సులు, భద్రతా ప్రమాణాలపై రెవెన్యూ, అగ్నిమాపక శాఖలతో కలిసి పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు.
ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు కోరారు. బుధవారం ఉంగుటూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు. వెంకట రవిచంద్ర కుమార్, రామోజీరావు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
VZM: గరివిడిలోని మసీదులో జరిగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన ఆయన, అల్లా దీవెనలు అందరికీ మెండుగా లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
JGL: భీమారంలో ‘లైన్ మెన్ దినోత్సవం’ సందర్భంగా విద్యుత్ శాఖ లైన్మెన్లను సర్పంచ్ స్వాతి సంజీవ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో విద్యుత్ సిబ్బంది పాత్ర కీలకమని, ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో వారు చూపుతున్న అంకితభావాన్ని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
NLG: నల్గొండలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. SI సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగుడి జనార్ధన్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్, స్థానిక ప్రముఖులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరూ పరస్పరం రంగులు చల్లుకుంటూ హర్షాతిరేకంగా శుభాకాంక్షలు తెలియజేసి ఐక్యతను ప్రదర్శించారు.
WGL: కొమ్మాల జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గం తన అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె సుస్మిత పటేల్ పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. సుస్మిత తనకంటే ధైర్యవంతురాలని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎంతటివారినైనా ఎదుర్కొంటుందని భరోసా ఇచ్చారు.
GDWL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న గ్రామ, 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించి, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుతామని చెప్పారు.