ATP: సోషల్ మీడియాలో మహిళా పోలీసును వేధించిన ఏఆర్ కానిస్టేబుల్ గురుమోహన్ రెడ్డిపై అనంతపురం నగర పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కానిస్టేబుల్ ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మహిళకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన బాధితురాలి భర్త (పోలీస్ అధికారి) నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ELR: విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులతో పాటు చిల్లర దుకాణాల యజమానులు నిరంతరం గమనిస్తుండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సైకిల్ పంచర్ గ్లూ, వైట్నర్, ఫెవికాల్ వంటి వస్తువులను విద్యార్థులు తరచూ కొనుగోలు చేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు.
WNP: వనపర్తి డిపో పరిధిలో శుభకార్యాలు, విహారయాత్రలకు అద్దె బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు (79957 01851, 96765 63377, 7382829313) విడుదల చేశారు. ఈ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయని పేర్కొన్నారు.
BPT: బల్లికురవ మండలం వైదన గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. పిడుగురాళ్ల నుంచి అద్దంకి వైపు వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై, టోల్ప్లాజా అంబులెన్స్లో క్షతగాత్రుడిని అద్దంకి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ను మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. గత BRS ప్రభుత్వంలో దళితుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
WGL: పర్వతగిరి మండలం పంచరాయ తండాకు చెందిన భానోత్ యాకూబ్ (45) అనే వ్యక్తి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, తరచూ వస్తున్న కడుపునొప్పిని భరించలేక సోమవారం సాయంత్రం తన పొలం వద్ద పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో మైనార్టీ షాది ఖానా కోసం నిధులు మంజూరు చేస్తానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నియమిస్తున్న షాదీఖానా పనులు నిలిచిపోవడంతో ఎంపీ నిధులతో పూర్తి చేయాలని మైనార్టీ సోదరులకు సూచించారు. రెండుసార్లు ఐదు లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. నాయకులు ఉన్నారు.
JGL: కోరుట్ల శివారులోని D40 కాలువలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతను ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లికి చెందిన రాజ్ కుమార్ (38)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
MDK: పాపన్నపేట మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో ఓ నూతన ఇంటి కిటికీలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. గమనించిన ఇంటి సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారి కిష్టయ్య బృందం అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను బంధించారు. పట్టుకున్న పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.
అనకాపల్లి: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నర్సీపట్నం గురుకుల పాఠశాలలో బాలురు, అచ్యుతాపురంలో బాలికలకు 5వ తరగతి, 6, 7, 8 తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 గురుకుల కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు.
KDP: బలపనూరు 132/33 కేవీ సబ్స్టేషన్లో అత్యవసర పనులు చేయనున్నట్లు ఏఈ బాలసంజీవులు తెలిపారు. ఈ కారణంగా మంగళవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భద్రంపల్లి, తొండూరు, మల్లెల సబ్స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహరించాలని ఆయన కోరారు.
TG: హైదరాబాద్ నగర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. అయితే రాబోయే కొన్ని గంటల్లో నగరవ్యాప్తంగా మళ్లీ తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచనలు చేశారు. కాగా, రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
NLG: నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లోని అమరవీరుల స్థూపం ముందు బాల్క సుమన్ అక్రమ అరెస్టును BRSV కార్యకర్తలు ప్లకార్డులు, నల్ల కండువాలతో సోమవారం రాత్రి నిరసన తెలిపారు. BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేతను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
KKD: అన్నవరం కొండపై రామాలయం వద్ద సోమవారం 60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. దేవస్థానం అధికారులు అతడిని 108 వాహనంలో తుని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడని అన్నవరం పోలీసులు తెలిపారు. మృతుని మెడలో జంధ్యం, తువ్వాలు ఉన్నాయి. అతని వివరాలు తెలిసిన 9440796530 నెంబర్ కు తెలియజేయాలన్నారు