• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హైదరాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ స్కాలర్షిప్ రాట్లే. !

HYD: హైదరాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు గత మూడు సంవత్సరాల స్కాలర్షిప్‌లు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రూ.750 చొప్పున 10 నెలలకు రూ.7,500 ఇవ్వాల్సి ఉండగా నిధులు విడుదల కాలేదని తెలిపారు. పెండింగ్ మొత్తాన్ని వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

February 25, 2026 / 09:10 AM IST

ఓటీటీ ప్రియులకు బిగ్ షాక్

ఓటీటీ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel, Jugnoo అనే ఐదు OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.  అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, గతంలోనూ పలు ఓటీటీ సంస్థలను కేంద్రం బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.

February 25, 2026 / 09:10 AM IST

విజయవంతంగా వైసీపీ సంస్థాగత నిర్మాణ కమిటీ సమావేశం

NTR: ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మాజీమంత్రి యోగి రమేష్ మాట్లాడుతూ.. వైసీపీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసి, పార్టీని గ్రామస్థాయి వరకు మరింత శక్తివంతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 09:10 AM IST

విద్యుదాఘాతంతో గేదె మృతి

SRPT: విద్యుదాఘాతంతో గేదె మృతిచెందిన ఘటన చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేతు సోమయ్య చారికి చెందిన గేదెను ఇంటి నుంచి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ తీగ తగిలి గేదె అక్కడిక క్కడే మృతిచెందింది.

February 25, 2026 / 09:10 AM IST

రూ.280 కోట్లతో ఉస్మాన్ సాగర్ నుంచి కొత్త పైప్ లైన్

HYD నగరానికి జంట జలాశయాలు మంచినీటి వరప్రదాయినిగా నిలుస్తున్నాయి. 1920 ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్ నగర్ వరకు సుమారు 16 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించారు. కాలక్రమేణా మరమ్మత్తులు పెరగడంతో లీకేజీలు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.280 కోట్ల వ్యయంతో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

February 25, 2026 / 09:09 AM IST

రాజాం జాతరలో అపశృతి

PPM: రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్వహించిన బాణసంచా ప్రదర్శనలో డోలపేట గ్రామానికి చెందిన శ్రీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా పేలుస్తున్న సమయంలో ఒక ఔట్ బాక్స్ నేరుగా వచ్చి ఆమెకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

February 25, 2026 / 09:08 AM IST

తహశీల్దారుకు రైతుల వినతి పత్రం అందజేత

KNR: అసంపూర్తిగా నిలిచిపోయిన డీ-8 ఉప కాలువ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి నీటిని అందించాలని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత రైతులు తహసీల్దార్ కనకయ్యకు వినతి పత్రం అందజేశారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయి నష్టపోయామన్నారు. కాలువ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగక పంటలకు నీరు అందడం లేదని, అన్నారు.

February 25, 2026 / 09:08 AM IST

‘డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా’

MBNR: కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని డివిజన్ కార్పొరేటర్ గూండా సంతోష్ అన్నారు. మంగళవారం రాత్రి డివిజన్‌కు సంబంధించిన నాయి బ్రాహ్మణ కాలనీ ప్రజలు కార్పొరేటర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

February 25, 2026 / 09:07 AM IST

టీనేజ్ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమం

KDP: సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయ డిప్యూటీ డెమో ఆఫీసర్ ప్రసన్న లత విద్యార్ధినీలకు టీనేజ్ ప్రెగ్నెన్సీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల తక్కువ బరువు గల శిశువులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. టీనేజ్ పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని అలవాట్లు మానుకోవాలని తెలిపారు.

February 25, 2026 / 09:07 AM IST

నేడు పలు గ్రామాలకు విద్యుత్ కట్

VZM: బొబ్బిలి మండలం పెంట విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు చెప్పారు. రంగరాయపురం, జె.రంగరాయపురం, చెల్లారపువలస, ఎం.బూర్జవలస గ్రామాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.

February 25, 2026 / 09:07 AM IST

గ్రామస్థాయి పరిపాలనలో జీపీఓల పాత్ర కీలకం: అదనపు కలెక్టర్

ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:06 AM IST

గ్రామస్థాయి పరిపాలనలో జీపీఓల పాత్ర కీలకం

ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:06 AM IST

శ్రీవారి సేవలో మాజీ మంత్రి రోజా

TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

February 25, 2026 / 09:05 AM IST

ఈనెల 28న జిల్లాకు జాతీయ ST కమిషన్ సభ్యుడు రాక

ASF: జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 28న తిర్యాణి మండలంలో పర్యటించనున్నట్లు BJP మండల అధ్యక్షుడు సారా రమేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ సభ్యుడు పర్యటనలో భాగంగా మండలంలోని మంగి గ్రామాన్ని సందర్శించడంతో పాటు మారుమూల ప్రాంతాల్లోని రోడ్లు, పోడు భూముల సమస్య, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 09:05 AM IST

త్వరలోనే హాస్పిటల్ ప్రారంభం: మంత్రి

WGL: త్వరలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మొత్తం 35 డిపార్ట్‌మెంట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించబోతున్నామని, ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

February 25, 2026 / 09:05 AM IST