E.G: గోకవరం మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు కరాసు శివప్రసాద్ గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా సంత్ గాడ్గే బాబా అవార్డు అందుకున్నారు. రజక జాతి అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. సంత్ గాడ్గే బాబా ఆశయాలను సమాజానికి విస్తృతంగా తీసుకెళ్తున్నామని బీజేపీ నేత ఉంగరాల ఆది విష్ణు తెలిపారు.
SRPT: కోదాడలో నేడు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10:15 గంటలకు పట్టణంలోని కటకమ్మగూడెం రోడ్లో నారాయణ హాస్పిటల్ ప్రారంభోత్సవం, 11:15 గంటలకు మోతే మండలం అన్నారిగూడెం గ్రామంలో గణేష్ కుమార్తె అన్నప్రాసన, పట్టణంలో సుధాకర్ రావు కుమారుడి వివాహానికి సాయంత్రం 6 గంటలకు పాల్గొంటున్నారు.
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకేసారి రెండు OTTల్లోకి వచ్చేసింది. సన్నెక్స్ట్లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉంది.
ADB: నార్నూరులో హోలీ పండుగకు ముందే ప్రకృతి రంగుల సంబరాలు ప్రారంభమయ్యాయి. అడవుల్లో మోదుగు చెట్లు ఎర్రటి జ్వాలల్లా వికసించి అరణ్యాన్ని అగ్నివర్ణంతో కప్పేశాయి. పచ్చని చెట్ల మధ్య మెరిసే ఈ ఎర్ర పూలు గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది మోదుగు పూలతో నార్నూర్ అరణ్యాలు హోలీకి సహజ రంగుల వేదికగా మారుతున్నాయి.
AP: ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి సాగునీరు, స్టీల్ ప్లాంటుకు నీరు ఇవ్వటమే లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీరు ఇవ్వాలన్నదే ఆలోచన అని పేర్కొన్నారు. ఫేజ్-1, 2 పనుల కోసం బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించామని చెప్పారు. ఉత్తరాంధ్రలో మిగతా ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తామన్నారు.
TG: పసుపు కొనుగోళ్ల జాప్యంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఈ-నామ్ 2.0లో సాంకేతిక సమస్యలపై ఆరా తీశారు. ఢిల్లీలోని ఈ-నామ్ జాయింట్ సెక్రటరీ చిన్మయితో ఆయన మాట్లాడారు. పాత పద్ధతిలోనే పసుపు కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
JN: దేవరుప్పులలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై సృజన్ కుమార్ మాట్లాడుతూ… వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.
NGKL: కుమ్మెర బాధితులను పరామర్శించే తీరిక కాంగ్రెస్ నాయకులకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శించారు. గురువారం తల్లోజు ఆచారితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలపై కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
KRNL: వైసీపీ పాలనలో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని MLC బీటీ నాయుడు విమర్శించారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఏఈ, డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వ్యవస్థ కుదుటపడుతోందని స్పష్టం చేశారు.
AP: కర్నూలు జిల్లా ఆదోనిలో విరూపాక్షిస్వామి, వీణ వివాహం ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. విరూపాక్షి స్వామి స్నేహితులతో కలిసి జనసేవ సామాజిక సంస్థ ఏర్పాటు చేసి, పదేళ్లుగా రక్తదానం, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వివాహ వేడుకల్లోనూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అయితే, వివాహ వేడుకల్లో వరుడితోపాటు పెళ్లికి వచ్చిన అతిథుల్లో 27 మంది రక్తదానం చేశారు.
WGL: కరీమాబాద్ SRR తోటలో అక్రమంగా నిర్వహిస్తున్న మూడు ఇసుక డంపులపై ఇవాళ మిల్స్ కాలనీ CI రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక డంపు చేస్తున్న వారిని అదుపులో తీసుకొని MRO ముందు బైండ్ ఓవర్ చేశారు. అనంతరం CI రమేష్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేయడం, తరలించడం చట్ట రీత్యా నేరమని సీఐ హెచ్చరించారు.
PPM: కొమరాడ మండలం దలైపేట గ్రామ సమీపంలో ఉన్న వరి పంట పొలాలలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం తెలిపారు. సమీప ప్రాంత రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. ఇదిలా ఉంటే పంట పొలాలలో ఏనుగులు గుంపు ప్రవేశించి పంటలను పాడు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
JN: ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రజా కవి జయరాజ్తో కలిసి విద్యార్థులు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహనపై చర్చలు జరిపారు. యువతలో ప్రకృతి పట్ల చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
SKLM: జలుమూరు మండలం ఆదర్శ మోడల్ స్కూల్ హెచ్ఎం మాధవరావు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఉచితంగా అందజేస్తున్నారు. శుక్రవారం అచ్యుతాపురంలో పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న MEO మాధవరావు మాట్లాడుతూ.. మండలంలో 16 జెడ్పీ పాఠశాలలు ఉన్నాయని, 462 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతుండగా వారందరికి సామాగ్రి అందజేశారన్నారు.
NLG: చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వచ్చే నెల మార్చి 6 వరకు జరగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వార్షిక జాతరకు చండూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాలకు భక్తులు తరలిరావాలని ఆలయ కమిటీ కోరుతుంది.