RR: నందిగామ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీని సర్పంచ్ కొమ్ము కృష్ణ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. సొంత ఇల్లు అనేది నిరుపేదలకు ఓ కలలాంటిదని, ఇందిరమ్మ ఇళ్లతో తమ కల నెరవేరిందని, కాంగ్రెస్ తోనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
వేతనాలపై సినీ వర్కర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం డబుల్ కాల్షీట్, 9-9 కాల్షీట్, 4 గంటలకు అదనపు కాల్షీట్ ఇవ్వాలని కోరింది. అడిగిన వేతనాలు ఇచ్చినవారికే పనిచేస్తామని.. ఇది నిరసన కాదని, కొత్త వేతనాలపై తమ నిర్ణయమని తెలిపింది. మార్చి 1 నుంచి కొత్త వేతనాలకు పనిచేస్తామని పేర్కొంది. నిర్మాతలకు అభ్యంతరం ఉంటే యూనియన్లతో మాట్లాడాలని సూచించింది.
BDK: అశ్వారావుపేట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పలు గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్య మహిళా సాధికారత, వ్యవసాయం, మత్స్య రంగాలకు సంబంధించిన పనులకు శంఖుస్థాపనలు చేసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పాతగంగారం గ్రామంలో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.
RR: షాద్నగర్ నియోజకవర్గం వెలిజర్ల గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బాబు నాయక్ బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించి పోస్టర్ను ఆవిష్కరించారు. పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందాలంటే బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించాల్సిందేనని స్పష్టం చేశారు.
RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం)లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ అద్భుతమైన సైన్స్ ప్రదర్శనలను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన సైన్సు ప్రాజెక్టులను కౌన్సిలర్ మురళి మోహన్ తిలకించి అభినందించారు. వివిధ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
KRNL: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై కర్నూలు MP బస్తిపాటి నాగరాజు ఇవాళ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
MNCL: ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తి పన్ను, నల్లా బకాయిలు మార్చి 31లోపు పూర్తిగా వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. పన్నులు చెల్లించని వారిపై తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అన్నమయ్య: సదుం, సోమల మండలాల్లో ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సదుం మండలం దిగువ గొల్లపల్లిలో రైతు సాగు చేస్తున్న చామంతి పూల తోటను పరిశీలించి, ఉద్యాన పంటల ద్వారా ఆదాయం పెంచుకోవాలని రైతులకు సూచించారు.
SRPT: హుజూర్ నగర్ స్థానిక 14వ వార్డు ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కౌన్సిలర్ దగ్గుపాటి కవితా బాబురావు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీను, కమిషనర్ శ్రీనివాస్, ఎస్సై మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని పిలుపునిచ్చారు.
కోనసీమ: సఖినేటిపల్లి మండలం రాంబాగ్ దగ్గర శ్రీ చైతన్య స్కూల్ బస్సు అతి వేగంతో వచ్చి కొబ్బరి చెట్టును ఢీ కొట్టింది. బస్సులో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గొంది నుంచి అంతర్వేది రాంబాగ్ వస్తుండగా డ్రైవింగ్ క్లీనర్కి ఇవ్వటంతో ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో 230 పరిశ్రమల యూనిట్ల పురోగతి గురించి పరిశ్రమల అధికారులతో కలెక్టర్ బాలాజీ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, వారికి కావాల్సిన సహకారం అన్ని విధాల అందిస్తామని, ప్రభుత్వ రాయితీలు మంజూరు చేస్తామన్నారు.
KMM: నగర శివారు వెలుగుమట్ల రెవిన్యూ గ్రామంలో భూధాన్ భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసె వాసులకు బీఆర్ఎస్ పార్టీ ద్వారా సహాయ కార్యక్రమాలు ప్రతి రోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలైన అంబేద్కర్ భవన్, టీటీడీసీ కేంద్రాల్లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం బాధితులకు ఆహారం అందజేశారు.
ASF: క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా క్రీడాధికారి శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 4వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 4లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు.
BDK: కరకగూడెం మండలం వట్టం వారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న మెనూ, భోజన నాణ్యత, వసతి సౌకర్యాలు, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు.