పోలవరం జిల్లాలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా వివిధ గ్రామాల్లో పులి కనిపిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామ పరిసర ప్రాంతంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. 527/6 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 584 పరుగులకు ఆలౌటైంది. శుభమ్(121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (72) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
JGL: రూరల్ మండలం రఘురాములకోట గ్రామంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
HNK: ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నేడు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. డాక్టర్ మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని, ఒత్తిడిని వదిలి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.
NLG: మర్రిగూడ మండలం ఖుదాబాక్షపల్లిలో పశు వైద్య, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సురేందర్, యమునా ఆధ్వర్యంలో 21 గేదెలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయలక్ష్మి, గోపాలమిత్ర సూపర్వైజర్ ప్రసాద్ పాల్గొని పశుపోషకులకు అవగాహన కల్పించారు.
MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చరిత, మాధవి, ప్రవీణ్ పాల్గొన్నారు.
ADB: గర్భిణీ, బాలింత, చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని HEO పవార్ రవీందర్ అన్నారు. గురువారం నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్సం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు సంతోష్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేటలో ఒంటరిగా కనిపించిన బాలుడి వివరాలు ‘HIT TV’లో వార్తగా రావడంతో తక్షణ స్పందన లభించింది. తమ బిడ్డ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీఐ ఫిరోజ్ సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించగా, తమ బిడ్డ ఆచూకీ తెలిపిన పోలీసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా మార్చి 9 తర్వాత పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ మార్కు డైలాగులు సినిమాలో హైలైట్ కానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
SRPT: నడిగూడెంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు ఆరుగురు విద్యార్థులు డుమ్మా కొట్టారు. పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్ విజయ, వాణి పర్యవేక్షించారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రతిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
AKP: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం 17 రోజులే ఉందని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే డయల్ యువర్ టీచర్ ప్రోగ్రాం ప్రతిరోజు చేయడానికి సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి ఆరు గంటల నుంచి 9 గంటల వరకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు.
AP: పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవ్వరికీ నష్టం లేదు అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘సముద్రంలోకి వెళ్లే నీటిని మేం ఉపయోగించుకుంటాం. కాళేశ్వరం గోదావరిపైనే కట్టారు.. నేను అభ్యంతరం చెప్పలేదు. నలమల సాగర్తో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదు. మేం కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణ వారు కూడా నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పొద్దు’ అని పేర్కొన్నారు.
SRPT: నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల గ్రామ పంచాయతీలో పొదుపు మహిళా బృంద సమావేశ మందిర (VO బిల్డింగ్) నిర్మాణానికి గురువారం సర్పంచ్ మరోజు పార్వతమ్మ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, వారి సమావేశాల నిర్వహణకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందన్నారు.
VSP: సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆర్.నల్లకన్ను మరణంపై సీపీఐ జిల్లా సమితి సంతాపం వ్యక్తం చేసింది. జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న జన్మించిన నల్లకన్ను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని తెలిపారు. బడుగు బలహీనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆయన నిజాయితీకి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.