• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పవన్ కళ్యాణ్ యువశక్తి ప్రోగ్రాంకు అంతా సిద్ధం!

శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనవరి 12వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి బహిరంగ సభకు అంతా సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జరుగనుంది. ఈ సభలో జనసేన పార్టీ 100 మంది యువతకు నిరుద్యోగం, ఉపాధి, అభివృద్ధి తదితర అంశాలపై ప్రసంగించేందుకు అవకాశమిస్తారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు అక్కడి నుండి ప్రసంగించనున్నారు. ఈ యువ శక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు మరింత...

January 11, 2023 / 06:10 PM IST

మోడీ ఎవరికి దేవుడో చెప్పాలి: బీజేపీకి కేటీఆర్ ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోడీ దేవుడు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అంటున్నారని, అసలు ఆయన ఎవరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ నిలదీశారు. దేవుడు అన్న వ్యక్తికా, లేక గుజరాత్‌కు దేవుడా చెప్పాలని ప్రశ్నించారు. తన హయాంలో గ్యాస్ నుండి నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని, అందుకు ఆయన దేవుడు అవుతారా అన్నారు. గ్యాస్ ధర రూ.వెయ్యి దాటిందని, పెట్రోల్ ధర రూ.100 దాటిందని, ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులను కొట్టిం...

January 11, 2023 / 06:06 PM IST

సోషల్ మీడియాపై సోమువీర్రాజు స్పెషల్ ఫోకస్..!

ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి తగినంత గుర్తుంపు సంపాదించుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  బీజేపీ నేత సోము వీర్రాజు.. తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.  సోషల్‌ మీడియా వేదికను నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని  ఆయన పార్టీ నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అభివృద్ధి...

January 11, 2023 / 06:00 PM IST

ప్రత్యేక హోదా కోసం బస్సు యాత్ర…!

రాష్ట్ర విభజన తర్వాత…. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశం మరుగునపడిపోయింది.  కేంద్రంలో ప్రభుత్వం మారడంతో…. కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ పట్టించుకోవడం మానేసింది. ఎన్నిసార్లు ఎంత మంది నేతలు అడిగినా… కేంద్రం స్పందించలేదు. మళ్లీ… అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో… మ‌రోసారి విభ‌జ‌న హామీలు, ప్ర‌త్యేక హోదా తెర‌మీద‌కు వ‌చ్చాయి. ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌న...

January 11, 2023 / 05:56 PM IST

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది.. వసంత కృష్ణ ప్రసాద్..!

మైలవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నానని చెప్పారు. తాను చిన్నతనంలో తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని ఆయన అన్నారు. అయితే…. ఒకప్పటి రాజకీయాలకీ, ఇప్పటి రాజకీయాలకీ  చాలా తేడాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కోసారి రాజకీయాల్లో...

January 11, 2023 / 05:48 PM IST

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ..? కారణమిదేనా..?

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ నేతలతో సినీ ప్రముఖుల భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. చంద్రబాబు- రజనీ మంచి స్నేహితులు.. కానీ రాజకీయ కోణం కూడా ఉంటుంది. నిజానికి రజనీకాంత్‌కు తమిళనాడులో అభిమానులు ఎక్కువ. తలైవా అంటూ ఆరాధిస్తారు. ఆయనను రాజకీయ పార్టీ పెట్టాలని కోరాగా మక్కల్ మంద్రం పేర...

January 10, 2023 / 10:32 PM IST

మీ ఇద్దరిలో ముఖ్యమంత్రి ఎవరు?: పవన్-చంద్రబాబులకు మిథున్ ప్రశ్న

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ రెండురోజుల క్రితం కలుసుకోవడంపై వైసీపీ నాయకుల విమర్శలు, ప్రశ్నలు ఆగటం లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా, విడదల రజని… ఇలా వరుసపెట్టి సెటైర్లు వేస్తున్నారు. గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబును కలవడం విడ్డూరంగా ఉందని విడదల రజని నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, ఎంపీ మిథు...

January 10, 2023 / 10:20 PM IST

అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు నోటీసులు

రాజధాని అమరావతి అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ ప్రభుత్వం గతంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ...

January 10, 2023 / 10:12 PM IST

అబ్బే అదేం లేదే, పార్టీ మార్పుపై పొంగులేటి శ్రీనివాస్ యూ టర్న్, కానీ..?

తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీ మార్పు అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిలో ఉన్నారని, అందుకే పార్టీ మార్పు గురించి ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్రానికి సిద్దంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు గత నాలుగున్నరేళ్ల నుంచి ఏ పదవీ లేకుండా ఉన్నానని అసహనం వ్యక్తం చేశారు. దీంతో...

January 10, 2023 / 08:16 PM IST

కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా.. బీఆర్ఎస్ తెలంగాణ చీఫ్‌గా బండ ప్రకాశ్..?

భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్ పదవీని తోట చంద్రశేఖర్‌ అప్పగించారు. మరీ తెలంగాణ శాఖను ఎవరికీ ఇస్తారు అనే చర్చ వచ్చింది. ఇప్పటికే విపక్షాలు కూడా సెటైరికల్‌గా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వారికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ శాఖకు...

January 10, 2023 / 08:06 PM IST

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్: సీఎస్ సోమేశ్ కుమార్ కొనసాగింపు రద్దు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు జారీచేయగా సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉన్నత పదవీ (సీఎస్)గ...

January 10, 2023 / 07:55 PM IST

కాల్వ శ్రీనివాసులు వర్సెస్ కాపు రామచంద్రారెడ్డి : అక్రమాలపై కదంతొక్కిన నేత, అరెస్ట్

అనంతపురంలో టీడీపీ, వైసీపీ ముఖ్య నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిని టీడీపీ ముఖ్య నేత కాల్వ శ్రీనివాసులు టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ఇసుక మాఫియా, మద్యం సప్లై, ఆయుధాల సరఫరా, నకిలీ నోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి  అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని రాయదుర్గం నియోజకవర్గంలో గల ఉద్దేహాల్ నుంచి తిమ...

January 10, 2023 / 07:43 PM IST

వారిలో టెన్షన్: టీడీపీ-జనసేన పొత్తు వైసీపీకే ఎక్కువ లాభమా?

టీడీపీ-జనసేన పొత్తు: 14లో వలె తీపా, 19వలె చేదా? తెలుగుదేశం-జనసేన పొత్తు ఆ పార్టీల అధినేతలకు కొత్త తలనొప్పి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో అంచనాలతో వైసీపీకి 151 సీట్లతో ప్రజలు గెలిపిస్తే, అన్నింటా ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. జగన్ పాలనపై ఓ రకమైన అసంతృప్తి ఉంటే, దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు ఆ...

January 10, 2023 / 07:36 PM IST

నకిలీ చలాన్ల కలకలం: ఆబ్కారీ శాఖకే బురిడీ, రూ.కోటికి పైగా నష్టం

కేటుగాళ్లు దేనిని వదలడం లేదు. అవును ఎక్కడ అవినీతికి ఛాన్స్ ఉంటే అక్కడ కరప్షన్ చేస్తున్నారు. చివరికీ వైన్ షాపు టెండర్లను కూడా విడిచి పెట్టలేదు. వైన్ షాపు కోసం టెండర్ వేసే సమయంలో చలాన్ ఇస్తుంటారు. అయితే అందులో రూ.కోటి రూపాయలకు పైగా నకిలీ చలాన్లు ఉన్న విషయం ఆలస్యంగా బయటపడింది. ఇందులో బ్యాంక్ క్యాషియర్ పాత్ర ఉందని నిర్ధారించారు. ఈ స్కాం బయటపెట్టింది ఎక్సైజ్ సీఐ కావడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా వర్...

January 10, 2023 / 07:27 PM IST

డిపాజిట్ రానిచోట గెలుస్తారా? తెలంగాణపై బీజేపీ పక్కా గేమ్ ప్లాన్!

దక్షిణాదికి గేట్‌వే గా భావిస్తున్న తెలంగాణలో ఈసారి ఎలాగైన అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా పని చేస్తోంది. పక్కా గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ తమకు అంతగా బలం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బలమైన అభ్యర్థులను దరి చేర్చుకోవడం, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశనం, ఎన్నికల...

January 10, 2023 / 07:18 PM IST