• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

టేబుల్ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం

WGL: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాల్గవ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో WGL కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకం సాధించారు. అదేవిధంగా 55 ఏళ్ల గెజిటెడ్ అధికార బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్‌లకు బంగారు పతకం సాధించారు.

February 21, 2026 / 08:24 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

BHPL: టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బిక్కినేని సంపత్ రావు తండ్రి బిక్కినేని మేటల్ రావు ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి నిన్న రాత్రి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

February 21, 2026 / 08:24 AM IST

వ్యభిచార దందా కట్టడి చేయాలని వినతి

WGL: రాయపర్తి మండలం మైలారం శివారులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను అరికట్టాలని శనివారం గ్రామస్థులు సర్పంచ్ చిర్ర వేణుకు వినతిపత్రం సమర్పించారు. ఈ దందా కారణంగా గ్రామ యువత దారితప్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

February 21, 2026 / 08:24 AM IST

PM సూర్య ఘర్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

అన్నమయ్య: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం కార్యక్రమాల అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు వేగవంతమైన అమలు, మున్సిపల్ సేవలు, శాంతిభద్రతలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలపై సూచనలు జారీ చేశారు.

February 21, 2026 / 08:24 AM IST

చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీపై శిక్షణ

AKP: చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీపై శుక్రవారం పాయకరావుపేట తాండవ రైతు ఉత్పత్తిదారుల సంఘం కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఎలమంచిలి కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎస్ మీనాక్షి మాట్లాడుతూ.. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. వీటి తయారీకి తక్కువ ఖర్చు అవుతుందని అన్నారు.

February 21, 2026 / 08:21 AM IST

అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరాచర్యలు

HYD: పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్‌సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరా కఠిన చర్యలు తీసుకుంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే బ్లాకులను విక్రయానికి పెట్టినందుకు సదరు ప్రమోటర్‌పై రూ. 43.71 లక్షల ఫైన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అలాగే నిర్మాణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది.

February 21, 2026 / 08:21 AM IST

ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటన వివరాలు

కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని రెగ్యులేటర్ పునప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం ఉదయం 10 గంటలకు పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం ఆరుగొలును గ్రామంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

February 21, 2026 / 08:21 AM IST

రాయలసీమ హక్కుల కోసం శైలజానాథ్ ఉద్యమ సన్నాహాలు

ATP: రాయలసీమ హక్కుల సాధన కోసం మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సీమను మోసం చేసేవారికి ఇది హెచ్చరిక అని పేర్కొంటూ, హక్కుల కోసం సమరం తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

February 21, 2026 / 08:20 AM IST

మళ్లీ బంగ్లాతో ఫైనల్.. చరిత్ర రిపీట్ చేస్తారా?

రేపు ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో బంగ్లా తలపడనుంది. సెమీస్‌లో SLను IND, PAKను BAN ఓడించి ఈ తుదిపోరుకు చేరాయి. అయితే 2023 టోర్నీలోనూ ఇలాగే సెమీస్, ఫైనల్ ఇవే జట్ల మధ్య జరిగింది. నాటి టైటిల్ పోరులో బంగ్లాపై భారత్ 31 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సారీ అలాగే ప్రత్యర్థిని రాణించాలని యువ భారత్ భావిస్తోంది.

February 21, 2026 / 08:18 AM IST

మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం..?

NZB: 2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 08:17 AM IST

తక్షణమే రైతుబంధు విడుదల చేయాలి: హరీశ్ రావు

SDPT: మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 17వ తేదీన రైతుబంధు విడుదల చేస్తానని సీఎం రేవంత్ చెప్పారని, 20వ తేదీ వచ్చినా ఇప్పటికీ నిధులు జమ కాలేదని హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడా?, కోతల సమయంలోనా? ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పంటలకు ఇవ్వలేదని, ఈసారి అయినా విడుదల చేస్తారా? అని నిలదీశారు.

February 21, 2026 / 08:17 AM IST

శ్రీ ముఖలింగేశ్వరస్వామి ఆదాయం వివరాలు

SKLM: జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగేశ్వరుని ఆలయంలో హుండీ ఆదాయాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏడుకొండలు పర్యవేక్షణలో శుక్రవారం లెక్కించారు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం జరిగినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. రూ. 7.31 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.

February 21, 2026 / 08:17 AM IST

మాట నిలబెట్టుకున్న మాజీ మేయర్

KNR: కరీంనగర్‌లో ఎన్నికల హామీని నెరవేర్చిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన మాడిశెట్టి రవీందర్ కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.25,000 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హామీని అమలు చేశామన్నారు.

February 21, 2026 / 08:17 AM IST

ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాలువలకు నీటి విడుదల

GNTR: ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం కృష్ణా డెల్టా పంట కాలువలకు మొత్తం 2,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో కృష్ణా పశ్చిమ కాలువకు 2,212, తూర్పు కాలువకు 502, మరియు గుంటూరు ఛానల్‌కు 144 క్యూసెక్కుల నీటిని కేటాయించారు. అలాగే తూర్పు కాలువ ద్వారా కేఈబీకి 302, బందరు కాలువకు 200 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.

February 21, 2026 / 08:15 AM IST

ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్

AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ ముగించింది. సుదీర్ఘంగా 6 ఏళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ తుది నివేదికను కోర్టుకు సమర్పించగా, కోర్టు దాన్ని ఆమోదించి కేసును మూసివేసింది. 2019లో రీపోస్టుమార్టం కోసం వెలికితీసిన ఆయేషా శరీర అవశేషాలకు ఈ నెల 27న ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

February 21, 2026 / 08:15 AM IST