• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిషేధిత ప్లాస్టిక్ పై యుద్ధం ఆగలేదు

ATP: నిషేధిత ప్లాస్టిక్ పై యుద్ధం ఆగలేదని.. మరో 3 నెలల్లో మార్పు చూపిస్తానని మున్సిపల్ కమిషనర్ బాలస్వామి పేర్కొన్నారు. అనంతపురం నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగించరాదని ప్రజలు, షాప్ యజమానులకు అవగాహన కల్పించామన్నారు. నిషేధిత ప్లాస్టిక్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించమని మున్సిపల్ కమిషనర్ తేల్చి చెప్పారు.

September 13, 2025 / 07:35 AM IST

గ్రీన్ టెక్ ఇంజినీరింగ్ సిస్టంలో ఏపీ సీట్ సోదాలు

SRD: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంకు సంబంధించి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని గ్రీన్ టెక్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏపీ సీట్ అధికారులు శుక్రవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. 9 మంది సభ్యులతో ఉన్న సిట్ బృందం కంపెనీలో తనిఖీలు చేపట్టింది. ఏపీ సిట్ అధికారుల తనిఖీలు స్థానికంగా కలకలం రేపాయి.

September 13, 2025 / 07:33 AM IST

‘విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపునిస్తాయి’

SRCL: ఉద్యోగులకు విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపునిస్తాయని మండల విద్యాధికారి వినయ్ కుమార్ అన్నారు. ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన జీవశాస్త్ర ఉపాధ్యాయులు దేశెట్టి మల్లేశం, తక్కల్ల లచ్చిరెడ్డిలను మూడపల్లి కాంప్లెక్స్ సముదాయంలో మండల విద్యాధికారి వినయ్ కుమార్ శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మల్లేశం పాల్గొన్నారు.

September 13, 2025 / 07:33 AM IST

BREAKING: మాజీ సీఎం మృతి

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) మరణించారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. మేఘాలయ రాజకీయాల్లో లాపాంగ్ కీలక పాత్ర పోషించారు. 1972లో రాజకీయ ప్రవేశం చేసి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 1992 నుంచి 2010 మధ్య 4 సార్లు సీఎంగా పనిచేశారు.

September 13, 2025 / 07:33 AM IST

యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్

BDK: అశ్వాపురం మండలం మిట్టగూడం తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన NSC క్యాంపును శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని NSC శిక్షణలో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందిస్తాయని కలెక్టర్ అన్నారు. నిబద్ధత వంటి విలువలు జీవితంలో అలవర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని తెలిపారు.

September 13, 2025 / 07:32 AM IST

కంభంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల, కందులాపురం, చిన్నకంభం, గచ్చుకాలువ వీధి తదితర ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ నరసయ్య తెలిపారు. ఇందులో భాగంగా మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.  ఈ అసౌకర్యనికి ప్రజలు సహకరించాలని కోరారు.

September 13, 2025 / 07:31 AM IST

కూకట్‌పల్లి హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితులు

HYD: కూకట్‌పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితులైన రోషన్, మరో వ్యక్తిని పోలీసులు జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు నిందితులను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరిస్తున్నామని, నిందితులను విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

September 13, 2025 / 07:31 AM IST

జీహెచ్ఎంసీలో 97మందికి పదోన్నతులు

HYD: జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, వారితో సమాన స్థాయి హోదా ఉన్న 97 మందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

September 13, 2025 / 07:30 AM IST

40 కేజీలు గంజాయి పట్టివేత

SKLM: పలాస రైల్వే స్టేషన్‌‌లో శుక్రవారం RPF ఎస్సై ఎం. మాల్యాద్రి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న బిహార్‌‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 40 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పలాస రైల్వే పోలీస్ సీఐ రవికుమార్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడతామన్నారు.

September 13, 2025 / 07:29 AM IST

పర్యవేక్షణ లోపం.. మండుతున్న బొగ్గు

VSP: స్టీల్‌ప్లాంట్‌లో కీలక విభాగమైన RMHPలో పర్యవేక్షణ లోపం కారణంగా తరచూ కోకింగ్‌కోల్ నిల్వల్లో మంటలు చెలరేగుతున్నాయి. బాయిలర్‌కు అవసరమైన కోల్ నిల్వల్లో ఎయిర్ గ్యాప్స్ వల్ల ఆక్సిజన్‌తో కలిసి మంటలు చెలరేగడం సహజమే. కాంట్రాక్ట్ లేబర్ తొలగింపు, కన్వేయర్ల నిర్వహణ లోపం, అధికారుల బదిలీల వంటి పరిణామాలతో ఇలాంటివి జరుగుతున్నాయని కార్మిక సంఘాలు అంటున్నాయి.

September 13, 2025 / 07:28 AM IST

సమాజంలో టీచర్ల పాత్ర కీలకం

ELR: భీమడోలు శ్రీనివాస కళ్యాణం మండపంలో పుప్పాల మోహన సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గురు పూజోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎంపీ మహేష్ కుమార్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురిని సన్మానించారు. అనంతరం ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా కీలకమన్నారు.

September 13, 2025 / 07:27 AM IST

స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు

SDPT: ఐటీఐలలో స్పాట్ అడ్మిషన్ల కోసం గడువును పొడిగించినట్లు కుకునూర్పల్లి ఐటీఐ ప్రిన్సి పాల్ వెంకటరమణ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ల గడువు ఈనెల 30వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇదివరకే అడ్మిషన్లు పొంది కళాశాలకు రాని వారిని తొలిగించి వారిస్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. వివరాల కోసం 8500465850లో సంప్రదించాలని కోరారు.

September 13, 2025 / 07:26 AM IST

రోజూ ఉదయాన్నే 5 నిమిషాలు ఇలా చేస్తే!

రోజూ ఉదయం కేవలం 5 నిమిషాలు జంపింగ్ జాక్స్ వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఇలా చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. గుండె సంబంధింత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. ఒత్తిడి తగ్గి మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.

September 13, 2025 / 07:25 AM IST

ఒక్క దరఖాస్తు రాకపోవడంతో మళ్లీ రీనోటిఫికేషన్

CTR: మద్యం బార్లకు దరఖాస్తు గడువును మళ్ళీ పొడిగిస్తూ శుక్రవారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క దరఖాస్తు రాకపోవడంతో మళ్లీ రీనోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించారు. కాగా, 18వ తేదీ చిత్తూరు కలెక్టరేట్‌లోని DRDA సమావేశ మందిరంలో అదృష్ట పరీక్ష ద్వారా మద్యం బార్లను కేటాయించనున్నారు.

September 13, 2025 / 07:21 AM IST

ఫైనల్ బెర్తుపై భారత్ గురి 

ఆసియాకప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఫైనల్ బెర్తు సాధించడమే లక్ష్యంగా ఇవాళ జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కనీసం డ్రాగా ముగించినా సలీమా బృందం తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఈ టోర్నీ ఆరంభంలో దూకుడుగా ఆడిన భారత్.. చైనాతో సూపర్-4 మ్యాచ్‌లో 1-4తో కంగుతింది. ఫైనల్ చేరాలంటే జపాన్‌ను భారత్ నిలువరించాల్సి ఉంది.

September 13, 2025 / 07:20 AM IST