నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆమెతో ప్రమాణం చేయించారు. కొంతమంది మంత్రులతో ఆమె కేబినెట్ సమావేశం నిర్వహించారు. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి రికార్డు సృష్టించిన కర్కి.. ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగానూ ఆరుదైన ఘనత సాధించారు.
Asia Cup 2025 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 160 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ హారిస్ (66; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (29), ఫకార్ జమాన్ (23*), హసన్ నవాజ్ (9), ఫహీం అష్రఫ్ (8) పరుగులు చేశారు. షహీన్ అఫ్రిది (2) నాటౌట్గా నిలిచాడు. ఒమన్ టార్గెట్ 161.
అన్నమయ్య: జిల్లాకు ఒక సంవత్సరంలో మూడు నెలల కాలంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్ అనేక రకాలుగా సేవలు అందించారని గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. జిల్లాకు గౌరవ కలెక్టర్ చామకూరి శ్రీధర్ విశిష్ట సేవలు అందించి ప్రజల్లో కలెక్టరుగా మంచి పేరు సంపాదించుకున్నారన్నారు. నేడు కలెక్టర్ బదిలీ కారణంగా అందరికీ బాధ ఉందని ఆయన తెలిపారు.
GNTR: శుక్రవారం ఉదయం బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇంజనీరింగ్ కళాశాల బస్సు ఢీకొని హైకోర్టు అడ్వకేట్ జనార్ధనరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు. బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యాశాఖల బస్సుల అతివేగం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో పరకాల-గంగిరేణి గూడెం ఆర్టీసీ బస్సు రెగ్యులర్గా నడవడం లేదని స్థానికులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా బస్సు సరిగా రాకపోవడంతో నిజాంపల్లి గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పరకాల డిపో మేనేజర్ స్పందించి బస్సు సర్వీసు రెగ్యులర్గా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ADB: తలమడుగు మండలంలోని పల్సి(బి) తాండ గ్రామస్తులు MLA అనిల్ జాదవ్ ను నేరడిగొండలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో BSNL టవర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
NZB: వలసదారులు, దుర్భర కుటుంబాల స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో జిల్లాలో అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ పార్ట్నర్ ఫండ్ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులతో కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
కోనసీమ: రాజోలు పట్టణంలో ప్రమాదకరంగా బైకులతో వీరంగం చేస్తున్న యువతపై పోలీసులు దృష్టి సారించారు. శుక్రవారం నిబంధనలను అతిక్రమించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను సీఐ నరేశ్ కుమార్ అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TG: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్స్ తప్పనిసరి చేసింది. 2,3 వీలర్స్, బస్సులు, ట్రాక్టర్లు, ట్రెయిలర్లు, గూడ్స్ తదితర అన్ని రకాల వెహికల్స్ కచ్చితంగా వీటిని అమర్చుకోవాలని ఆదేశించింది. రోడ్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
SKLM: నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చిన మంత్రి నారా లోకేష్ బాబు చొరవ అభినందనీయమని పాతపట్నం ఎమ్మెల్యే ఎం.గోవిందరావు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిపాలనా దక్షత, మానవత్వంలోనూ తండ్రి చంద్రబాబుకి తగ్గ తనయుడిగా లోకేష్ నిలుస్తున్నారని కొనియాడారు.
TPT: తడ ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 10 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీ.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థు అర్హులన్నారు. ఈ నెల 15 లోపు https://naipunyam.ap.gov.in/user-registration https://naipunyam.ap.gov.in/user-registration వెబ్సైట్లో నమ...
PPM: జిల్లా అభిృద్ధిలో తనదైన పరిపాలనా విధానాలతో, సేవా భావంతో జిల్లా ప్రజలు, అధికారులందరి మన్ననలు పొంది చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అని జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు. జిల్లా ఆవిర్భావం తరువాత రెండో జిల్లా కలెక్టరుగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి తనదైన ముద్రను వేశారని కొనియాడారు.
KNR: చేనేత వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కళాకారుల నైపుణ్యం ఇక్కడ ప్రదర్శించిన వస్త్రాల్లో కనిపిస్తున్నదని తెలిపారు.
BHPL: జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను శుక్రవారం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యంత్రాల భద్రత, సీసీ కెమెరా పర్యవేక్షణ, సీల్ వేసిన తాళాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సిబ్బంది, రాజకీయ నేతలు ఉన్నారు.
MNCL: విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ అన్నారు. బెల్లంపల్లి మైనారిటీ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం సందర్శించారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను సమీక్షించి, సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, అభ్యాసానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు అవసరమైన సూచనలు చేశారు.