కృష్ణా: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో సోమవారం పశువులకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల మాసోత్సవాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి కార్యక్రమం ప్రారంభించారు. వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయనతో పాటు సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, పశు సంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.