WGL: సంగెం మండలం ఏలూరు స్టేషన్ గ్రామంలోని గుట్ట చుట్టూ మొరం దందాను అరికట్టాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు సపావట్ మహేందర్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అక్రమంగా మొరం దందా చేస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.