GDWL: రాజోలి మండలం తూర్పు గార్లపాడు శివారులో కరెంటు షాక్కు గురై మరణించిన యువరైతు శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఇవాళ రైతు స్వగ్రామం తుమ్మలపల్లికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేలా చేస్తామని హామీ ఇచ్చారు.