ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని MLA హరీష్ బాబు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ ని ఆసుపత్రి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషంట్ సేవలని విస్తరించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ప్రతి రైతుకూ ‘ఫార్మర్ ఐడీ’ తప్పనిసరని మూసాపేట మండల ఏఈవో శశిత తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఫోన్ నెంబర్ రైతు వేదికకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ఐడీ ఉంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ సాయం నేరుగా అందుతుందని స్పష్టం చేశారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
AKP: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో 27 మందికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం స్థానిక జడ్పీ అతిథిగృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వీరికి రూ.13.76 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
W.G: తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామం విశాల సహకార పరపతి సంఘ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం శనివారం జరిగింది. నూతన అధ్యక్షులుగా అబ్బిన వీర వెంకటరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి మాట్లాడారు. సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
BDK: మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధి,1వ వార్డు, వాగు మల్లారం గ్రామంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్గత రోడ్లు, అంతర్గత డ్రైనేజీ సమస్యలను పరిశీలించి తక్షణమే పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.
NZB: చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న పేర్కొన్నారు. సాలూరులో పంచాయతీ కార్యదర్శులకు బాల్య వివాహాల నిరోధక చట్టం-2006పై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
KMM: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆమెకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
CTR: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 4వ వార్డు కట్టమంచి లాయర్స్ కాలనీలో రూ. 19.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. లాయర్స్ కాలనీ ఎక్స్టైన్షన్కు“వెంకటరమణ నగర్”గా నామకరణం చేసి ఆవిష్కరించారు.
TG: గతంలో DCC అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే టికెట్ రానివారికి ఎమ్మెల్సీలు ఇచ్చామన్నారు. పార్టీ కోసం కృషి చేసిన మరో 60 మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. పార్టీలో అందరి పని తీరు మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. మెరిట్ ఉన్న వారికి పార్టీలో కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు.
AP: YCP నేతల తీరు దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీకి రారని.. మండలిలో సభ జరగనివ్వట్లేదని తెలిపారు. దేవదేవుడి ఫొటోలు పట్టుకుని మండలికి చెప్పులతో వచ్చారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో అన్నిరంగాల్లోనూ దోపిడీయేనని పేర్కొన్నారు.
కోనసీమ: దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తోంది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, పుదుచ్చేరిలోని యానాం ప్రాంతానికి ఎ. తోట రాజును పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది.
E.G: కడియం మండలం వేమగిరిలో నిర్మించిన శ్రీ ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపనకు ఆలయ కమిటీ పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. మంత్రి కందుల దుర్గేష్, MLAలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బల రామకృష్ణ, MLC సోము వీర్రాజు, తదితరులకు శనివారం ఆహ్వాన పత్రికలు అందించారు. ఈనెల 26న ఆలయ ప్రతిష్టాపన జరుగుతుందన్నారు.
MHBD: తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు ఉప్పలయ్య- ధనమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు ధర్మారపు ప్రశాంత్ కుమార్ వివాహ వేడుక శనివారం కళ్యాణలక్ష్మి గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరై, నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక వాహబ్ పేట, ఉమామహేశ్వరి శివాలయం ప్రాంతంలో జరుగుతున్న యెల్లి కాలువ అభివృద్ధి పనులను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలన్నారు. పనులు నాణ్యతతో జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో శనివారం మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మా తెలుగు తల్లి చిత్రపటానికి కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు, సెక్రెటరీ రామ్మోహన్ పూలమాల వేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ‘దేశ భాషలందు తెలుసు లెస్స’ అని శ్రీకృష్ణదేవ రాయలు అన్న విషయాన్ని గుర్తు చేశారు.