2023-24కి గాను నాస్కామ్(Nasscom)కు కొత్త ఛైర్పర్సన్గా అనంత్ మహేశ్వరి(Anant Maheshwari) ఎంపికయ్యారు. అయితే అనంత్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా చేస్తుండటం విశేషం. మరోవైపు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ను అదే సమయ వ్యవధిలో వైస్ చైర్పర్సన్గా నియమించినట్లు నాస్కామ్ ప్రకటించింది.
మహారాష్ట్ర(Maharashtra)లో సీఎం షిండే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా..? త్వరలో ఆయన మాజీ కాబోతున్నారా..? ఎన్నికలకు ఏడాది ముందు మహారాష్ట్రలో మళ్లీ ప్రభుత్వం మారే అవకాశముందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
అఖిల్ ఏజెంట్(agent) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ సినిమా ఐటెం సాంగ్ రీసెంట్ విడుదల చేశారు. దీనిలో ఊర్వశీ రౌతలా(Urvashi Rautela) ఆడిపాడారు.
అగ్రరాజ్యం అమెరికా 80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడైన్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో 2024లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ సైతం 2024 ఎలక్షన్లలో పోటీ చేస్తానని వెల్లడించారు.
హైదరాబాద్లో(hyderabad) మరో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు(police) చేధించారు. దీంతోపాటు 13 మంది అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులకు ఉపాధియే లక్ష్యంగా రాబోయే నూతన విద్యా సంవత్సరం 2023-24 నుంచి తెలంగాణ ఉన్నత విద్యామండలి సెక్టార్ స్కిల్ కోర్సులను (నైపుణ్య శిక్షణ కోర్సులు) అందుబాటులోకి తేనుంది.
నీళ్లు లేవు.. నిధులు లేవు.. నియమకాలు లేకుండా చేశారని. తెలంగాణకు సింగరేణి ఉద్యోగాల గని.. ఉమ్మడి రాష్ట్రంలోనే లక్ష 20 వేల ఉద్యోగాలున్న సింగరేణిలో ప్రస్తుతం 42 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) అన్నారు
భారత క్రికెట్ బోర్డు (BCCI) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ఏప్రిల్ 25న 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.
మరోసారి పాకిస్థాన్(Pakistan) బాంబు పేలుళ్ల(Bomb Blast)తో దద్దరిల్లిపోయింది. వరుస పేలుళ్లలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 12మంది పోలీసులు(Police) ఉన్నారు. ఈ పేలుడు దాటికి 50 మందికి పైగా సామాన్యులు గాయపడ్డారు.
విద్యార్థులు..సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మ్యూజిక్ స్కూల్ మూవీ గుర్తు చేసినట్లు అనిపిస్తుంది. ఈరోజు హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసిన ఈ ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. ఈ చిత్రం మే 12 , 2023న తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ చాలా వేగంగా పెరిగింది. ప్రజలు డబ్బు పంపించడం, చెల్లింపులు చేయడం, షాపింగ్ చేయడం వంటి అనేకం డిజిటల్గానే చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సప్ ద్వారా కరెంటు బిల్లులను చెల్లించే సేవను కూడా ప్రారంభించింది.