TG: సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఆందోల్ నియోజకవర్గానికి మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా పోసానిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్డీ డిస్టలరీని మంత్రి ప్రారంభించారు. ఈ సంస్థను విస్తరించి 500 మందికి ఉపాధి కల్పించేలా చేస్తామన్నారు.
భారతదేశ వైద్యరంగంలో గాడ్మదర్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ ఎస్.ఐ. పద్మావతి ప్రయాణం స్పూర్తిదాయకం. బర్మా నుండి వలస వచ్చి దేశంలోనే తొలి క్యాత్ ల్యాబ్ను స్థాపించి వైద్యరంగంలో విప్లవం తెచ్చారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి, 90 ఏళ్ల వయసులోనూ రోగులకు సేవ చేస్తూ ఆదర్శంగా నిలిచారు. గుండె వైద్య రంగంలో ఆమె చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది.
HYD: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ పాటిల్ ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పాటిల్కు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఘన స్వాగతం పలికారు. నగరంలోని వివిధ కార్యక్రమాలలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులకు సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి భూమి ప్రదేశం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఉన్న బండలను తొలగించి, ప్రహరి గోడ నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆలయ కమిటీ తెలిపారు. సర్పంచ్తో పాటు, మాజీ ఎంపీటీసీ, మాజీ విండో డైరెక్టర్, కుల సంఘల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి సెట్-A ప్రశ్నపత్రాలు శనివారం నడిగూడెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. పరీక్షల నిర్వాహకులు వీటిని పోలీస్ స్టేషన్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. నడిగూడెంలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
MDK: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇవాళ చిన్నశంకరంపేట్ మండలం సూరారం జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి, సబ్జెక్టులవారీగా చదివే విధానం వివరించారు. తల్లిదండ్రులు హాజరుపై దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయులు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రోత్సహించాలని అన్నారు.
NRPT: ఉట్కూరు మండల పరిధి బిజ్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా దాతలు సహకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్, శ్రీ అంబత్రాయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరశ్రీతో కలిసి ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు సదుపాయాని వినియోగించుకోవాలని కోరారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఐశ్వర్య వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు సహాయం అందించింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం, పెళ్లి చీరను అందజేశారు. గత 21 ఏళ్లుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
AP: రాష్ట్రంలో మలేరియా కేసులు తగ్గుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అల్లూరి, మన్యం జిల్లాల్లో అధిక కేసులు నమోదయ్యాయని చెప్పారు. దోమల నియంత్రణకు స్ప్రే, ఫాగింగ్, డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో 89,845 దోమతెరలు పంపిణీ చేశామని వెల్లడించారు.
NGKL: హైదరాబాద్ ఏవీ కాలేజీలో ప్రారంభమైన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు జిల్లా కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శనివారం జరిగిన మొదటిరోజు సమావేశంలో ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కథా రచయిత వహీద్ ఖాన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జిల్లా కవులు తాము రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు.
TG: జోగులాంబ గద్వాల జిల్లాలో ఐజ పట్టణ పరిధిలో ఒక డ్రిప్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో డ్రిప్ పైపులు, ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.
VZM: స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ కింద శనివారం రాజాం పురపాలక సంఘ పరిధిలో పోలిపల్లి అమ్మవారి గుడి దగ్గర నుంచి బొబ్బిలి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. శుభ్రతను ప్రోత్సహించి, చెత్త లేని పరిసరాలను సాధించే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు తెలిపారు.
KMR: బాన్సువాడ రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఘటనపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ క్రమంలో వ్యక్తిపై దాడి చేసిన వారు, రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఆందోళన చెందకుండా తమ రోజువారీ పనులు చేసుకోవాలని ఆయన సూచించారు.
MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు పంట ఉత్పత్తుల ధరలను కార్యదర్శి అశ్వక్ హైమద్ వెల్లడించారు. వేరుశనగ గరిష్టంగా రూ.10,621, పత్తి రూ.6,301 పలికింది. మినుములకు గరిష్ట ధర రూ.8,063 లభించగా, మొక్కజొన్న రూ.1,889 ధర పలికినట్లు తెలిపారు. ఆయా పంటల కనిష్ట ధరలు వేరుశనగకు రూ.4,669,పత్తికి రూ.4,001,మినుములకు రూ.7,150,మొక్కజొన్నకు రూ.1,701గా నమోదయ్యాయి.
BDK: కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు నిండిన సందర్భంగా ఫిబ్రవరి 27న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఇల్లెందు IFTU కార్యాలయంలో పార్టీ నాయకులు వాల్ పొస్టర్లను ఆవిష్కరించారు. డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందన్నారు.