• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రైలులో వస్తూ మహిళ మిస్సింగ్

NDL: ధర్మవరం-మచిలీపట్నం రైలులో కడప జిల్లా ఎర్రగుంట్లకు వస్తూ వివాహిత అదృశ్యమైనట్లు ఎర్రగుంట్ల రైల్వే పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. తన భార్య శ్రీదేవి వైజాగ్‌లోని అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా అదృశ్యమైనట్లు నంద్యాలకు చెందిన భర్త జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

February 22, 2026 / 09:55 AM IST

జిల్లాలో నేటి మాంసం ధరల వివరాలు..!

కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాలలో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తుండగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.250 నుంచి రూ.260 మధ్య విక్రయిస్తున్నారు. కోడి కిలో రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధర కాస్త తగ్గుముఖం పట్టింది. మటన్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.

February 22, 2026 / 09:55 AM IST

చెరువులో దూకి మహిళా ఆత్మహత్య

RR: మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు తాళ్లపల్లి గ్రామానికి చెందిన నందిని అనే వివాహిత నాగుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:55 AM IST

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్టు

TG: హైదరాబాద్ శామీర్‌పేటలో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బీజేపీ చలో కామారెడ్డి పిలుపుతో ఈటలను అరెస్టు చేసినట్లు సమాచారం. కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్-బీజేపీ సవాళ్ల వివాదం సద్ధుమణగడం లేదు. బీజేపీ రాష్ట్ర నాయకులు కామారెడ్డికి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

February 22, 2026 / 09:54 AM IST

జిల్లాలో చికెన్ ధరలు ఇవే

SRCL: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.

February 22, 2026 / 09:54 AM IST

పుష్కరిణి వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

RR: మహాశివరాత్రి జాతర సందర్భంగా సంత్ నిరంకార్ ఆధ్వర్యంలో చేవెళ్ల వెంకటేశ్వర పుష్కరిణి వద్ద శ్రమదానంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ సమతా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జాతరకు వచ్చే భక్తులు పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:51 AM IST

రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలిలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 09:51 AM IST

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించిన దీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు.

February 22, 2026 / 09:51 AM IST

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్‌లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించిన దీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు.

February 22, 2026 / 09:51 AM IST

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం లేదు

జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. ఆధార్ కార్డు మిస్ మ్యాచింగ్ వల్లనే బిల్లులు ఆగావని, లబ్ధిదారులు ఆపపోహలు నమ్మవద్దని అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు వస్తాయని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 09:50 AM IST

రౌడీ రాజ్యం నడుస్తోందా?: బండి సంజయ్

TG: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే దాడులు చేయడమేంటి అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని, బీజేపీ కార్యకర్తలారా.. అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంకండి అని పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జింటిపై దాడి అమానుషం అన్నారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే అని ఆరోపించారు.

February 22, 2026 / 09:50 AM IST

నేడు బాధ్యతలు స్వీకరించనున్న చైర్మన్

BHPL: జిల్లా మున్సిపాలిటీ ఛైర్మన్‌గా బుర్ర కొమరయ్య నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి విజయోత్సవ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు.

February 22, 2026 / 09:48 AM IST

శవాన్ని దోచుకున్న దొంగలు అరెస్ట్

MBNR: ప్రమాదంలో మరణించిన లేదా అపస్మారక స్థితిలో ఉన్న బాధితుల వద్ద ఉన్న నగలు, నగదును దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17 రాత్రి రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పురుషోత్తం రెడ్డి మృతదేహంపై ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందుతులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:47 AM IST

ఉషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పురస్కారం

PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు 2026 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా పురస్కారం’ వరించింది. విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ‘మధురిమలు’ కవితా ప్రక్రియ ప్రోత్సాహం గుర్తించామన్నారు.

February 22, 2026 / 09:47 AM IST

జిల్లా రిజిస్ట్రార్‌గా సీహెచ్ నరసింహమూర్తి

అల్లూరి జిల్లా రిజిస్ట్రార్‌గా సీహెచ్ నరసింహమూర్తి నూతనంగా బాధ్యతలను చేపట్టారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నరసింహమూర్తికి ప్రభుత్వం రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించి అల్లూరి జిల్లాకు నియమించింది. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఆయనకు శనివారం ఉద్యోగులు, కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 09:47 AM IST