• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘డెకాయిట్’ ఫస్ట్ సింగిల్‌కు టైం ఫిక్స్

టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘రూబారూ’ రిలీజ్‌కు టైం ఫిక్స్ అయింది. FEB 27న సాయంత్రం 6:03 గంటలకు ఈ పాట రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక దర్శకుడు షానీల్ డియో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.

February 26, 2026 / 05:00 PM IST

ఆలయ భూములకు వేలం ఖరారు

AKP: నాతవరం శ్రీగంగాదేవి, నూకాలమ్మ తల్లి ఆలయాల 13 ఎకరాల వ్యవసాయ భూముల పంట కౌలకు గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం జరిగింది. 11 మంది పాటదారులు పాల్గొన్న ఈ వేలంలో గవిరెడ్డి సత్యనారాయణ రూ.1.48 లక్షలకు పాటను పొందారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, ఈవో సాంబశివరావు పాల్గొన్నారు.

February 26, 2026 / 04:56 PM IST

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

SRPT: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందన్నారు.

February 26, 2026 / 04:55 PM IST

వాహనాల పార్కింగ్‌కు స్థల పరిశీలన

CTR: మార్చి నెలలో పుంగనూరులో ప్రతిష్టాత్మకంగా శ్రీసుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలోనే జాతరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టనున్నారు. గురువారం మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సీఐ సుబ్బరాయుడు సంయుక్తంగా కలిసి వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని పరిశీలించారు.

February 26, 2026 / 04:55 PM IST

ఊట్ల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం గ్రామ ప్రభుత్వ పాఠశాలను గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని ఊట్ల పాఠశాలను పరిశీలించారు.

February 26, 2026 / 04:55 PM IST

డూప్లికేట్ గాంధీలు ఉన్నారు: KTR

TG: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని.. ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదేనన్నారు. శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్లు.. 4000 మంది పోలీసులతో పేదల ఇళ్లు కూల్చివేశారని మండిపడ్డారు. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై మంత్రులు కన్నేశారన్నారు.

February 26, 2026 / 04:55 PM IST

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

VKB: ఖాసీంపూర్ తండాకు చెందిన సరితకు పురిటినొప్పులు రావడంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్‌ను నిలిపి ఈఎంటీ అవినాష్ చాకచక్యంగా అక్కడే డెలివరీ చేయగా, సరిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 26, 2026 / 04:54 PM IST

‘చంద్రబాబు స్వార్థ రాజకీయం కోసం వెన్నుపోటు’

AP: రాయలసీమకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేశారని తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు లాలూచీ పడ్డారని ఆరోపించారు. జన్మనిచ్చిన సీమకు ఏమీ చేయలేదని ఇంగితం లేదా? అని ప్రశ్నించారు. ‘స్వార్థ రాజకీయం కోసం పిల్లనిచ్చిన మామకైనా.. జన్మనిచ్చిన సీమకైనా వెన్నుపోటు తప్పదు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

February 26, 2026 / 04:54 PM IST

రేపుదివ్యాంగుల కోసం ప్రత్యేక మెగా జాబ్ మేళా

VKB: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటెలెక్ట్యువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్4జాబ్స్ సాకారం కోసం దివ్యాంగుల ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఫిబ్రవరి 27, 2026న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో ఈ మేళా జరుగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్, దివ్యాంగ ధృవీకరణ లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.

February 26, 2026 / 04:52 PM IST

చేబ్రోలులో పీహెచ్‌సీ భవనానికి శంకుస్థాపన

GNTR: ఎమ్మెల్యే ధూళిపాళ్ల చొరవతో మంజూరైన రూ. 36 లక్షల నిధులతో చేబ్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు మైలా వెంకట రామ రాజు, ఎంపీటీసీ పఠాన్ ఇర్ఫాన్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ ఉమా శ్రీనివాసరావు, డాక్టర్ ప్రియాంక, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 04:50 PM IST

నీట్ పరీక్షకు తగు ఏర్పాట్లు చేస్తున్నాం: కలెక్టర్

కృష్ణా: న్యూఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాకేష్ లఖన్ నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే నెల 3వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

February 26, 2026 / 04:50 PM IST

ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్

RR: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, చేవెళ్ల మున్సిపల్ బీజేపీ వార్డ్ కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ పుట్టినరోజు సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన దయాకర్‌ను ఎంపీ అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

February 26, 2026 / 04:50 PM IST

ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శివప్రసాద్

BPT: ఇసుకపల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ. 40 లక్షలు మంజూరయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు కేటాయించినట్లు టీడీపీ నేత శివప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన గురువారం భూమి పూజ నిర్వహించారు.

February 26, 2026 / 04:50 PM IST

‘గౌరవెల్లి, గండిపల్లి పనులు వేగవంతం చేయండి’

SDPT: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. గండిపల్లి పనులు కేవలం 40 శాతమే పూర్తయ్యాయని వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని అన్నారు.

February 26, 2026 / 04:50 PM IST

‘భగీరథ మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి’

SRPT: కోదాడ పట్టణానికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ మేజర్ పైపులైన్లకు జరుగుతున్న మరమ్మతు పనులను మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ పనుల్లో జాప్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 04:48 PM IST