• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీ ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి: ఎమ్మెల్యే

E.G: వైసీపీ ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ గౌరవాన్ని కాలరాసారనీ విమర్శించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అగౌరవపర్చారనీ పేర్కొన్నారు. ఈ అపచారానికి జగన్ లెంపలు వేసుకోవాలన్నారు.

February 22, 2026 / 03:20 PM IST

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తమ అర్జీలను పంపించాలని సూచించారు.

February 22, 2026 / 03:19 PM IST

ఉరుసులో ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

KRNL: గంజహళ్లి గ్రామంలో మహాత్మ బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవానికి ఆదివారం ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బీ.వి జయ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దర్గా వద్ద పీఠాధిపతులు ముస్లిం సంప్రదాయంలో స్వాగతం పలికి, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన వారికి టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

February 22, 2026 / 03:16 PM IST

ఘనంగా జిల్లా స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు

VZM: జిల్లా స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ చైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 25, 26వ తేదీలలో జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని అన్నారు.

February 22, 2026 / 03:16 PM IST

‘ప్రతి కుటుంబంలో వ్యాపారవేత్త తయారవ్వాలి’

PPM: ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవేత్తగా తయారవ్వాలని జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం సుధారాణి తెలిపారు. ఆదివారం వీరఘట్టం మండలం తలవరం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలలో రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని పేర్కున్నారు.

February 22, 2026 / 03:14 PM IST

‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో సూర్య

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జనవరి నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను అతడిని ఈ అవార్డుకు నామినేట్ చేశారు. సూర్యతో పాటు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్, న్యూజిలాండ్ బ్యాటర్ డారల్ మిచెల్ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.

February 22, 2026 / 03:14 PM IST

తాడేపల్లిగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం

W.G: తాడేపల్లిగూడెం కడగట్లలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు ప్రారంభించారు. పోషకాహార లోపంతో కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.

February 22, 2026 / 03:12 PM IST

మండల సమస్యలపై గలమెత్తిన సభ్యులు

VZM: గరివిడిలో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడి వేడిగా సాగింది. ఎంపీడీవో సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యూరియాపై రైతులు ఆందోళన చెందుతున్నారని, అధిక ధరలకు ప్రైవేట్ షాపులు అమ్ముతున్నారని ఆరోపించారు.

February 22, 2026 / 03:12 PM IST

బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది: VH

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచనలను CM రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

February 22, 2026 / 03:12 PM IST

వసతి గృహంలో హ్యాపీ సండేను వివరించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లెలో బాలికల వసతి గృహంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై.. పిల్లలందరికీ హ్యాపీ సండే పై వివరించి, ఆదివారం హ్యాపీ సండే ప్రాముఖ్యతను ఎమ్మెల్యే పిల్లలకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చారన్నారు.

February 22, 2026 / 03:11 PM IST

నిడదవోలులో హనుమాన్ చాలీసా పారాయణ

E.G: నిడదవోలులో శ్రీరామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్తబృందం ఆధ్వర్యంలో ఆదివారం 53వ పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

February 22, 2026 / 03:10 PM IST

వెన్నం రాఘవేందర్ రెడ్డికి సీఎం నివాళి

MHBD:మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకుని వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులుఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:09 PM IST

కోతులను తరిమికొట్టేందుకు వినూత్న ప్రయత్నం

KNR: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ, ఇండ్లపైకి చేరి బెంబేలెత్తిస్తున్న వానరాలను తరమడానికి శంకరపట్నం మండలం కరీంపేట గ్రామపంచాయతీ పాలకవర్గం వినూత్నంగా ఆలోచించి ఎలుగుబంటి డ్రెస్, మాస్క్‌ను తెప్పించింది. వాటిని ఓ వ్యక్తికి ధరింపజేసి గ్రామంలోని పలు వార్డులలో తిప్పుతూ కోతులను తరిమివేశే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

February 22, 2026 / 03:09 PM IST

గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలి

VZM: భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. గ్రామాల అభివృద్ధికి అధికార యంత్రాంగం సహకరించాలన్నారు. అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచ్ లు, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలన్నారు.

February 22, 2026 / 03:09 PM IST

YCP నేతలపై మంత్రి ఆగ్రహం 

AP: YCP నేతలపై మంత్రి బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరస్వామిని వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. అసెంబ్లీలో చెప్పులు ధరించి  వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకుని వచ్చారని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే పతనమైపోతారని హెచ్చరించారు.

February 22, 2026 / 03:08 PM IST