• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకం: ఎస్పీ

VZM: జిల్లాలో నేరాలను అరికట్టడంలో పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకమని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జరిగిన నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. పాత నేరస్థులపై ప్రత్యేక బృందాలు కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

November 4, 2025 / 07:36 PM IST

విద్యార్థులలో సైన్స్ పై అవగాహన

KDP: చెకుముకి సైన్స్ సంబరాలు 2025 సందర్భంగా, మంగళవారం కమలాపురం మండల రిసోర్స్ సెంటర్‌లో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షను ఎంఈవో సుభాషిణి ప్రారంభించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులలో సైన్స్ అవగాహన పెంపొందించడం, వారి శాస్త్రీయ నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.

November 4, 2025 / 07:34 PM IST

రైతులకు నష్టం కాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: ఏవో

SKLM: ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహన రావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ధాన్యం కొనుగోలు విధానాలు, ఆన్‌‌లైన్ ఎంట్రీ ప్రక్రియ అంశాలపై అవగాహన కల్పించారు. రైతులకు నష్టం కాకుండా సమయానికి ధాన్యం కొనుగోలు జరగాలని తెలిపారు.

November 4, 2025 / 07:34 PM IST

‘సమగ్ర ఎరువుల యజమాన్య పద్ధతులు పాటించాలి’

AKP: వరి పంటపై తెగుళ్లు ఆశిస్తే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని పాయకరావుపేట ఏవో ఆదినారాయణ సూచించారు. మంగళవారం నామవరం, పీఎల్ పురంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వరి పొలాలను పరిశీలించారు. సమగ్ర ఎరువుల యజమాన్యాన్ని పాటించాలని సూచించారు. చిరు పొట్ట దశలో ఉన్న వరి పొలాల్లో 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 పొటాష్ వేయాలని తెలిపారు.

November 4, 2025 / 07:33 PM IST

‘కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని విజయవంతం చేయండి’

NLR: ఈ నెల 6, 7, 8 తేదీల్లో నగరంలోని విఆర్సీ మైదానంలో జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు కోరారు. ఈ మేరకు ఇవాళ VRC మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.

November 4, 2025 / 07:33 PM IST

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు పోలీసుల విజ్ఞప్తి

BDK: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం గుడికి వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని టూ టౌన్ సీఐ ప్రతాప్ భక్తులకు ఇవాళ పలు సూచనలు చేశారు. భక్త జనసమూహం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున గుడికి వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండాలని సూచించారు. ఆభరణాలు ధరించి వెళ్ళడం వలన దొంగతనం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.

November 4, 2025 / 07:30 PM IST

విద్యార్థినులకు ‘శక్తి’ టీమ్‌ల అవగాహన

సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘శక్తి’ టీమ్‌లు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినిలకు అవగాహన కల్పిస్తున్నాయి. మహిళల భద్రత కోసం శక్తి యాప్‌, సైబర్ నేరాలు, డ్రగ్స్, పోక్సో చట్టాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ మధ్య తేడాలు, ఈవ్ టీజింగ్‌, మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు.

November 4, 2025 / 07:30 PM IST

పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు అందజేత

కాకినాడ జిల్లా పోలీస్ శాఖకు రూ. 10 లక్షల విలువ గల 96 సీసీ కెమెరాలను కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులు మంగళవారం ఎస్పీ జి. బిందుమాధవ్‌కి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, కోరమండల్ సంస్థ సభ్యులను అభినందించారు. ఈ సాంకేతిక పరికరాలను, ప్రజల భద్రతా కొరకు, నేరాల నియంత్రణకు, ట్రాఫిక్ పర్యవేక్షణకు వినియోగించనున్నట్లు తెలిపారు.

November 4, 2025 / 07:30 PM IST

జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశం

W.G: పెదఆమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన 24వ జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇచ్చి వదిలేయకుండా, వారు యూనిట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించే వరకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.

November 4, 2025 / 07:29 PM IST

వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. రేపు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, ఎల్లుండి రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మే ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు కొనుగోళ్లతో పాటు సీసీఐ కొనుగోళ్లను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.

November 4, 2025 / 07:28 PM IST

ఆపార్ ఐడీ జనరేషన్ 100% పూర్తి చేయాలి: కలెక్టర్

MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు ఆపార్ ఐడీ జనరేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోలీస్ లైన్స్‌ను సందర్శించారు. పాఠశాలలో ఆపార్ ఐడీ జనరేషన్‌ను కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఉన్నారు.

November 4, 2025 / 07:28 PM IST

రహమత్ నగర్‌లో రేవంత్ రోడ్ షో

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, నవీన్ యాదవ్‌తో కలిసి రహమత్ నగర్‌లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

November 4, 2025 / 07:27 PM IST

భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్తత

BHPL: భూపాలపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ నాయకులు కుక్కలు, కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయడానికి లోపలికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

November 4, 2025 / 07:25 PM IST

డ్రగ్స్ నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బంది కీలకం: మంత్రి

NGKL: డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వంటి వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎక్సైజ్ అకాడమీలో గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా ఎంపికైన ఏఈఎస్, ఎస్ఐలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈసారి వారికి వెపన్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

November 4, 2025 / 07:23 PM IST

ప్రమాదంలో అత్తా కోడళ్లు మృతి.. మంత్రి నివాళి

HYD: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో బోరబండకు చెందిన అత్త కోడళ్లు గున్నమ్మ, కల్పన మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

November 4, 2025 / 07:23 PM IST