KMM: ఖమ్మం ప్రభుత్వ (విజయ) పాడి పరిశ్రమ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25 వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు. వివరాలకు 9959877109 సంప్రదించాలన్నారు.
VZM: మొంథా తుపాన్ కారణంగా మగ్గంలో నీరు చేరిన చేనేత కుటుంబాలకు శుక్రవారం రాజాం రేషన్ డిపో ద్వారా నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి 50 KGల బియ్యం, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కంది పప్పు ఒక్కోక్క కేజీ చోప్పున, నూనె 1 లీటర్ పంపిణీ చేసినట్లు CSDT అనంత కుమార్ తెలిపారు. రాజాంలో మొత్తం 236 చేనేత కుటుంబాలకు పంపిణీ జరిగిందన్నారు.
PPM: మొంథా తుఫాను అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ పశుఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డా. మన్మథ రావు గురువారం తెలిపారు. జిల్లాలో అన్ని మండలాల్లో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 231 పశువుల ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. ఈ శిబిరాల ద్వారా మొత్తం 29,751పశువులకు చికిత్సలు చేశామన్నారు.
E.G: గోకవరం మండలంలో గురువారం తుఫాన్ కారణంగా ఊర కాలువ ఉప్పొంగడంతో గోకవరంలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాచిన వేడి నీటిని త్రాగాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. లోతట్టు ప్రాంతాలకు వెంటనే శానిటేషన్ ప్రక్రియ చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ATP: బుక్కరాయసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని వీరభద్ర కాలనీలో ఓ చిన్నారి నీటి బకెట్లో పడి మృతి చెందింది. ప్రభాకర్, రజిని దంపతులు ఆటోలో తిరుగుతూ కూరగాయలు విక్రయంతో జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంకాలం వారి కూతురు చిన్నారి గీష్మ నీటి ఆడుకుంటూ నీటి బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NDL: మొక్కజొన్న లోడ్తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నేడు నంది కోట్కూరు మండలం, కొణిదేల గ్రామం నుంచి వెళ్తున్న లారీ డ్రైవర్కు ఫిడ్స్ రావడంతో రోడ్డు ప్రక్కన ఉన్న బండ పరుపు గనెటి గుంతలో పడింది. రోడ్డుపై వెళుతున్న వాహన దారులు చూసి వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేసి కర్నూలు ప్రభుత్వ ఆసుత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: కర్నూలు బస్సు ప్రమాదం నాడు హడావుడిగా ఫొటోలు దిగిన పాలకులు, అధికారులు ఇప్పుడు కనిపించడంలేదని బాధిత కుటుంబీకుడు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. విషవాయువు పీల్చి లంగ్స్లో ఇన్ఫెక్షన్తో అమలాపురం సమీపంలోని కాటరేనికోనకు చెందిన గుణసాయి కర్నూలు GGHలో చికిత్స పొందుతున్నాడని, రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నామని ఆదుకోవాలని కోరారు.
ప్రకాశం: కనిగిరిలో 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏఐటీయూసీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం, సీపీఐ పార్టీ కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ జెండాను జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసిన్ ఆవిష్కరించారు. కార్మికుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక కార్మిక సంస్థ ఏఐటీయూసీ అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర బాబు, బాలిరెడ్డి, రామారావు, తదితరులు పాల్గొన్నారు
SRD: మునిపల్లి మండలంలో మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు మేళా సంఘంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారని చెప్పారు. మూడు గంటలకు చల్మడ గ్రామంలో సోయా పర్చేస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.
HNK: పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం చెత్త, వర్షపు నీటితో అధ్వాన్నంగా మారింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి పురస్కరించుకొని టపాకాయల దుకాణాలు విక్రయించిన చెత్తను పడవేయడంతో ఇటీవలి వర్షాలకు తడిచి మరింత అధ్వాన్నమైంది. ప్రిన్సిపల్ స్పందించి చెత్త తొలగించే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఇవాళ డిమాండ్ చేశారు
SKLM: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించమని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలాల్లో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలని, స్కానింగ్ కేంద్రాలలో తనిఖీలు పెంచాలని అధికారులను ఆదేశించారు.
MBNR: డాక్టర్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా జడ్చర్ల పట్టణం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2k రన్ నేతాజీ చౌక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇట్టి రన్ను ప్రతిరోజు చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: స్వాతంత్ర సమరయోధుడు దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని శుక్రవారం కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ ఆధ్వర్యంలో పట్టణంలో 2k రన్ నిర్వహించి, ఎక్తా దివాస్ ప్రతిజ్ఞ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మనవంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నివాళి అన్నారు.
ASR: తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నామన్నారు. ముఖ్యంగా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి, క్లోరినేషన్ చేయిస్తున్నామని తెలిపారు.
ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనంగా ‘మొంథా’ తుఫాన్ మరింత బలహీనపడింది. తీరం దాటాక 48 గంటలకుపైగా భూభాగంపై తీవ్ర ప్రభావం చూపిన మొంథా ఐదు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. ఈనెల 25న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ భూభాగంపై అల్పపీడనంగా బలహీనపడింది. వారం రోజులుగా మొంథా బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.