బిగ్ బీ అమితాబ్కు ఖలిస్తానీ సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇంటి వద్ద భద్రతను మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో పంజాబీ సింగర్ దిల్జీత్ బిగ్ బీ కాళ్లకు నమస్కారించాడు. అయితే ఆ చర్య 1984 నాటి సిక్కుల వ్యతిరేకత హింసలో చనిపోయినవారిని అవమానించినట్లేనని, ఆ హింసలో అమితాబ్ది కీలక పాత్ర అని ఆ సంస్థ ఆరోపించింది.
AKP: వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్యం లోపం రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీపీవో సందీప్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం పాయకరావుపేటలో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించి క్లోరినేషన్ చేయాలన్నారు.
ADB: ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
WGL: నిట్ క్యాంపస్లో రూ.6.11 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త క్యాంటీన్కు నిట్ డైరెక్టర్ ప్రొ. బిద్యాధర్ సుబుధి శంకుస్థాపన చేశారు. 350 సీట్ల డైనింగ్ హాల్, ఆధునాతన కిచెన్తో విద్యార్థులు, సిబ్బంది కోసం సౌకర్యవంతంగా రూపొందించనున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని డైరెక్టర్ తెలిపారు.
NZB: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నిజాం మెడలు వంచి తెలంగాణకు విముక్తి కల్పించిన మహోన్నత వ్యక్తి పటేల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యోగేశ్వర్ గౌడ్, గణేష్, శివ కిరణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
BPT: మార్టూరు మండలంలోని ద్రోణాదుల గ్రామంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇవాళ పర్యటించారు. గ్రామంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వర్షం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
VKB: విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని PNPS అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ శుక్రవారం ఆరోపించారు. కుల్కచర్ల మండలం ఘణపూర్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దచెరువు దగ్గర ఒకే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో అధిక లోడ్తో అంతరాయం ఏర్పడుతుందన్నారు.
WNP: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్సై స్వాతి అన్నారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా శుక్రవారం రన్ ఫర్ యూనిటీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అమరచింత పోలీసుల ఆధ్వర్యంలో భగత్ సింగ్ చౌరస్తా నుంచి పురవీధుల గుండా పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
TPT: తిరుపతి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలాలు ఉన్నవారు నవంబర్ 5 లోపు ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ ఇన్ఛార్జ్ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు సచివాలయంలో EKYC చేసుకొని గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి మారాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 37 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
BHPL: గోరికొత్తపల్లి(M)గాంధీనగర్ లోని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక 20 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఇవాళ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేత కాడపాక రాజేందర్ అన్నారు. అధికారులు తాత్కాలికంగా మండలంలోని ఉపాధ్యాయులను రోజుకు ఒకరిని పంపి చదువు చెప్పిస్తున్నారు. కలెక్టర్, DEO స్పందించి తాత్కాలిక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు.
BHPL: గోరికొత్తపల్లి (M) గాంధీనగర్లోని ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక 20 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఇవాళ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేత కాడపాక రాజేందర్ అన్నారు. అధికారులు తాత్కాలికంగా మండలంలోని ఉపాధ్యాయులను రోజుకు ఒకరిని పంపి చదువు చెప్పిస్తున్నారు. కలెక్టర్, DEO స్పందించి ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు.
NLG: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దామచర్ల మండలంలో ఎస్సై ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ మార్చ్ జరిగింది. ఎంఆర్ కార్యాలయం నుంచి తాళ్ల వీరప్పగూడెం వరకు పోలీసులు, మండల ప్రజల భాగస్వామ్యంతో 2కే రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువత, స్థానిక నేతలు పాల్గొన్నారు.
HYD: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తార్నాకలో ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో OU ఆర్ట్స్ కాలేజీ నుంచి ఫీవర్ హాస్పిటల్ జంక్షన్ వరకు యూనిటీ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జశ్వాల్, జర్నలిస్టులు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
ELR: కుకునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించినారు. కుక్కునూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ యువతలో జాతీయ ఐక్యత మరియు సమగ్రత భావాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామరు.
KMM: చింతకాని మండలం పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం నేత సామినేని రామారావు హత్య ఘటనపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీపీఎం నేతలు గోపాలరావు, సుదర్శన్ నుంచి ఆయన వివరాలు సేకరించారు. ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీపీ దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు.