VKB: బండల ఇళ్ల కారణంగా గృహలక్ష్మీ లబ్ధిదారులు అయినప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ పథకానికి అర్హత పొందలేకపోతున్నారని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి కాంక్రీట్ రూఫ్ నిర్మాణం కోసం రూ. 2 లక్షలు మంజూరు చేసేలా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ సమస్యలకు కూడా ఉపశమనం సాధించవచ్చని అన్నారు.
TPT: కలెక్టరేట్లో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన చిత్రపటానికి కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో DR&O జి.నరసింహులు, ఆధికారులు పాల్గొన్నారు.
NGKL: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
SRPT: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయమని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలం కాసరబాధ గ్రామంలో దూడిగ రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నెరవేర్చి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.
VSP: విశాఖలోని 32వ వార్డు నేరెళ్ల కోనేరు ప్రాంతానికి చెందిన పెద్దిలమ్మ మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి ఎల్లప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానన్నారు.
కోనసీమ: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి వారికి ఆనందం, సంతోషం అందించే లక్ష్యంతో ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రపురం చింతపల్లి సూరన్న నగర్లోని బాలికల హైస్కూల్లో జరిగిన హ్యాపీ సండే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మానసిక ప్రశాంతత కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
RR: చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు అరవింద్ రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అరవింద్ రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పుచ్చకాయ తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. దోసకాయ బీపీని నియంత్రిస్తే, సిట్రస్ పండ్లు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీలు, టొమాటోలు గుండె రక్షణకు, రక్తపోటు తగ్గింపునకు తోడ్పడతాయి. గుమ్మడి, సొరకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు హృదయనాళ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వేసవిలో ఇవి శరీరానికి అద్భుతమైన మేలు చేస్తాయి.
ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆదివారం గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, స్థానిక ఎస్సై నాగరాజుతో కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు సిబ్బందికి, పరీక్షా నిర్వహణ అధికారికి తెలియజేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
HYD: శామీర్పేటలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హౌస్ అరెస్ట్లో ఉన్న ఈటల నివాసానికి పోలీసులు మరోసారి చేరుకుని బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కృష్ణా: మచిలీపట్నంలో టీడీపీ శాశ్వత పార్లమెంటు కార్యాలయ నిర్మాణానికి నేడు అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఈ వేడుకలో పాల్గొన్నారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత సొంత భవనం ఏర్పాటు కానుండటంతో కార్యకర్తలు పండుగలా వేడుక చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేడి గాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు.
PLD: డిజిటల్ ప్రపంచంలో ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా గృహిణులు, వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని, పార్ట్ టైమ్ జాబ్స్ ఫిషింగ్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సూచించారు. మోసపోయామని గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.
MNCL: జన్నారం మండలంలోని సర్పంచ్లకు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీవో జలంధర్ తెలిపారు. మంచిర్యాల మండలంలోని ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని 10 గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో శిక్షణ ఉంటుందన్నారు.
TG: మూసీపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మూసీ అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, రూ.లక్ష కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధిని తాము అడ్డుకోమని, కానీ పేదల ఇళ్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వెల్లడించారు.