• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యువజన విద్యార్థి ప్రజా సంఘాల ధర్నా

ELR: బుట్టాయిగూడెం మండలం K.R.పురం ఐటీడీఏ వద్ద యువజన విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ స్థలంలో నిర్మిస్తున్న వ్యాపార భవన నిర్మాణాలను ఆపివేయాలన్నారు. యధావిధిగా అదే స్థలంలో హాస్టల్ భవన నిర్మాణాలు చేపట్టాలని, గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దని పిఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

February 23, 2026 / 03:19 PM IST

కీలక మ్యాచ్‌లు ‘మోదీ స్టేడియం’లోనే ఎందుకు..?

అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన 2023 WC ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమిని భారత్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తాజాగా S-8లో సౌతాఫ్రికా చేతిలో కూడా ఇదే స్టేడియంలో భారత్ చిత్తుగా ఓడింది. ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగబోతోంది. దీంతో, ‘భారత్‌కు అచ్చిరాని ఈ స్టేడియంలోనే కీలక మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించాలి?’ అంటూ అభిమానులు SMలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

February 23, 2026 / 03:19 PM IST

రేపు శ్రీ రామక్కమ్మ 46వ ఆరాధన ఉత్సవాలు

CTR: విజయపురం మండలం కొసలనగరం మీట్టురు ఆశ్రమం నందు మంగళవారం శ్రీ రామక్కమ్మ 46వ ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాకులు వాసుదేవస్వామి పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు అఖండనామ భజనలతో ప్రారంభమవుతాయాని తెలిపారు. ఈ సందర్భంగా యజ్ఞం, కోలాటభజనలు, వీధినాటకాలు, ప్రదర్శనలు అమ్మవారి ఊరేగింపు అన్నదానం కార్యక్రమాలు ఉంటాయని వాసుదేవస్వామి వెల్లడించారు.

February 23, 2026 / 03:18 PM IST

పులివెందులలో పర్యటించనున్న మాజీ సీఎం

కడప: జిల్లా పులివెందులలో మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్ రేపటి నుంచి రెండు రోజుల పర్యటన చేపట్టనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న నందిపల్లిలో నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు.పర్యటన సందర్భంగా స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

February 23, 2026 / 03:18 PM IST

నందవరంలో జగన్‌పై టీడీపీ ధ్వజం

KRNL: నందవరం మండల టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కన్వీనర్ ఖాసింవలి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం ద్వారా జగన్ ప్రభుత్వం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. పవిత్రమైన తిరుమల ప్రతిష్ఠను మంటగలిపేలా అప్పటి పాలకులు వ్యవహరించారన్నారు.

February 23, 2026 / 03:18 PM IST

‘ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంది’

MLG: జిల్లా కేంద్రంలోని పోట్లపూర్ గ్రామంలో నూతన CC రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బానోత్ రవి చందర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

February 23, 2026 / 03:17 PM IST

రూ.2 లక్షల విలువైన బీమా చెక్కు అందజేత

GDWL: గట్టు మండలం చాగదోన గ్రామానికి చెందిన రంగస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. అయిజలోని బ్యాంకులో ఆయన చేయించుకున్న PMSBY బీమా పథకం ద్వారా రూ.2 లక్షల మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని బ్యాంకు మేనేజర్ రుద్ర గౌడ్ సోమవారం మృతుడి భార్య మాధవికి అందజేశారు. ఈ నగదును పిల్లల భవిష్యత్తుకు వాడాలని సూచించారు.

February 23, 2026 / 03:15 PM IST

సచివాలయాన్ని సందర్శించిన ఎస్టీ కమిషన్ మెంబర్

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర స్టేట్ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది కొరతపై అసహనం వ్యక్తం చేసి, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్ సమక్షంలో రికార్డులను పరిశీలించి, ప్రజలకు అన్ని సేవలు సమయానికి అందించాలని సూచించారు.

February 23, 2026 / 03:14 PM IST

రాజ్‌ వల్లే మళ్లీ నాలో మార్పు మొదలైంది: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ వల్లే మళ్లీ తనలో మార్పు మొదలైందని తెలిపింది. ‘వివాహ బంధం ముగిసిన తర్వాత ఇక ఎవరినీ నమ్మడం సాధ్యం కాదేమోననిపించింది. ఎందుకంటే ప్రేమ, స్నేహం అంగీకరించలేనంద బలహీనంగా మారిపోయా. రాజ్ నిడుమోరును కలిశాకే నాలో మార్పు వచ్చింది. రాజ్ అలాంటి ప్రేమను పంచిన వ్యక్తి’ అని చెప్పుకొచ్చింది.

February 23, 2026 / 03:13 PM IST

దుండగుల దాడిలో యువకుడికి గాయాలు

అన్నమయ్య: రాయచోటిలో అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. కొత్తపల్లి ప్రాంతానికి చెందిన ఖలీద్ (22) పై కత్తితో దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన ఖలీద్‌ను మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగిందని బాధితుడు తెలిపినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 03:13 PM IST

కేబినెట్ భేటీ ప్రారంభం

TG: రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై, రైతు భరోసా నిధులు విడుదలపై మంత్రులు చర్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. 

February 23, 2026 / 03:11 PM IST

అది తప్పుడు ప్రచారం: బొత్స

AP: వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫొటోలు పట్టుకున్నారనేది అవాస్తమవమని MLC బొత్స సత్యానారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని పత్రికల్లో ప్రచురించినందుకు గాను మండలి ఛైర్మన్ కూడా విచారం వ్యక్తం చేశారన్నారు.

February 23, 2026 / 03:11 PM IST

‘ఉద్యోగస్తుల పెండింగ్ బకాయిలు చెల్లించాలి’

KMM: సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ సోమవారం సీపీఎస్ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. కూసుమంచి మండలం, జీళ్ళ చెరువు కాంప్లెక్స్ మీటింగ్‌లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లెకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

February 23, 2026 / 03:11 PM IST

విజయ్-రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

విజయ్, రష్మికల పెళ్లి ఈనెల 26న ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి నికర ఆస్తి ఎంత ఉండవచ్చు అనే చర్చ SMలో జోరుగా సాగుతోంది. విజయ్‌కు జూబ్లీహిల్స్‌లో రూ.15 కోట్ల విలువైన బంగ్లా ఉండగా, అతని మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.70 కోట్లుగా అంచనా. అలాగే, రష్మికకు కర్ణాటక విరాజ్‌పేటలో రూ.8 కోట్ల ఇల్లు ఉంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.66 కోట్లు అని సమాచారం.

February 23, 2026 / 03:11 PM IST

‘మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి’

NRML: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మెన్ పడిగెల భూషణ్ అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలం లింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళ సంఘ భవనం (వీవో) భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంజిత్, వార్డు సభ్యులు రాజు, ఏఎంసీ డైరెక్టర్ నారాయణ ఉన్నారు.

February 23, 2026 / 03:10 PM IST