AP: విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలని సీఎం సూచించారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులతో సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడారు. కాగా, ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు.