ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి సవాళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆహార భద్రత, వాతావరణ ఆందోళనలను ప్రపంచం ఎదుర్కొంటోందని తెలిపారు. రానున్న కాలంలో ఏఐ, అంతరిక్షం, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు.