అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తనకు ఉరిశిక్షను ఖరారు చేయటంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా స్పందించింది. ఈ తీర్పు మోసపూరితమైందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆరోపించింది. అంతేకాకుండా తమ పార్టీని పూర్తిగా బహిష్కరించాలని దురుద్దేశంతో ఈ తీర్పును ఇచ్చేలా ఒత్తిడి చేసిందని ఆరోపించారు.