తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై TVK పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో సీనియర్ IPS అధికారి నేతృత్వంలో SIT ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను TVK సవాల్ చేసింది. సిట్ తమకు వ్యతిరేకంగా పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.