AP: మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక క్షేత్రంలో మహాసభలకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనరసింహ, హైకోర్టు జడ్జి జస్టిస్ రఘురాం, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.