AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈనెల 11న L&T, 23న మేఘా ఇంజినీరింగ్ వద్ద ఘటనలు జరిగాయి. అయితే, దీనిపై గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరగనుంది. సిట్ బృందంలో నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉన్నారు. తుళ్లూరు సీఐ, డీఎస్పీ సిట్ బృందంలో సభ్యులుగా ఉన్నారు.