మార్చి 30వ తేదీని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. ఇది క్రీస్తుశకం 800-1200లో భారతదేశానికి వచ్చింది. కాలక్రమేణా ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇడ్లీలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది.